Home » “గీతాగోవిదం” నీలూ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

“గీతాగోవిదం” నీలూ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by AJAY
Ad

కొంత‌మంది అమ్మాయిలు చూస్తుండ‌గానే గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోతుంటారు. దృష్యం సినిమాలో వెంక‌టేష్ చిన్న కూతురుగా న‌టించిన ఎస్తెర్ అనిల్ ప్ర‌స్తుతం చూస్తే హీరోయిన్ త‌క్కువ కాకుండా క‌నిపిస్తోంది. అంతే కాకుండా సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ షో లో త‌గ్గేదే లా అంటుంది. ఇక ఇప్పుడు తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా గీతాగోవిందంలో న‌టించిన అమ్మాయి కూడా ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది.

Advertisement

 

గీతాగోవిందం సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ లెక్చ‌ర‌ర్ పాత్ర‌లో న‌టించాడు. అయితే సినిమాలో నీలు అనే అమ్మాయి విజ‌య్ వెంట ప‌డుతూ క‌నిపిస్తుంది. న‌న్ను పెళ్లి చేసుకో అంటూ అత‌డికి ప‌ర్స‌న‌ల్ వీడియోను సైతం పంపుతుంది. ఇక ఈ సినిమా చూసిన వారు నీలూను మ‌ర్చిపోలేరు. కాగా నీలు అస‌లు పేరు అనీషా భామ‌. ఇక అనీషా భామ ఇప్ప‌డు గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయింది.

Advertisement

గీతా గోవిందం సినిమాతో పాటూ ప‌లు సినిమాల‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టించింది. గీతా గోవిందం సినిమా త‌ర‌వాత ఓ బేబీ సినిమాలో రావు ర‌మేష్ కు కూతురుగా కూడా న‌టించింది. ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది. అంతే కాకుండా ఈ సినిమా త‌ర‌వాత పెళ్లి కూతురు పార్టీ సినిమాలో కూడా న‌టించింది.

అదేవిదంగా మ‌హ‌ర్షి సినిమాలో కూడా అనీషా న‌టించి మెప్పించింది. ఇక ఇప్పుడు స‌త్తిగాని రెండెక‌రాలు సినిమా లో హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాలో పుష్పలో అల్లు అర్జున్ స్నేహితుడిగా న‌టించిన క‌మెడియ‌న్ హీరోగా న‌టించాడు.ఈ సినిమా కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కాగా ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. మ‌రి అనీషా హీరోయిన్ గా స‌క్సెస్ అవుతుందో లేదో చూడాలి.

ALSO READ : మోహన్ బాబు వలన సినిమా ఛాన్స్ మిస్ చేసుకుని నేడు కోట్లు సంపాదిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా ??

Visitors Are Also Reading