Home » సంజూకు నో ఛాన్స్.. BCCI, ఇషాన్ కిషన్ పై ఫ్యాన్స్ ఫైర్

సంజూకు నో ఛాన్స్.. BCCI, ఇషాన్ కిషన్ పై ఫ్యాన్స్ ఫైర్

by Bunty
Ad

ఇవాళ టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. వెస్టిండీస్ జట్టుపై టెస్ట్ సిరీస్ ను గెలిచిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్ గెలిచేందుకు సిద్ధమవుతోంది. ఇక వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇవాళ జరిగిన తొలి వన్డే మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది రోహిత్ సేన.

Advertisement

దీంతో మొదట బ్యాటింగ్ చేస్తోంది వెస్టిండీస్. అయితే తుది జట్టులో మాత్రం సంజు శాంసన్ కు చోటు దక్కలేదు. అతని ప్లేస్ లో టెస్టుల్లో ఘోరంగా విఫలమైన ఇషాన్ కిషన్ ను మొదటి వన్డేలో ఆడిస్తోంది టీమిండియా.  అయితే వెస్టిండీస్ తో తొలి వన్డే మ్యాచ్ కు భారత జట్టులో సంజు సాంసన్ కు ఛాన్స్ ఇవ్వకపోవడం పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంజు శాంసన్ కు సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు.

Advertisement

సంజు శాంసన్ ను వన్డే వరల్డ్ కప్ నుంచి తప్పించేందుకు బీసీసీఐ కుట్ర చేస్తోందని… అందుకే తొలి వన్డేలో అతన్ని ఆడించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫివరీటిజంతోనే సంజూ శాంసన్ ను ముంబై మాఫియా నాశనం చేస్తోందని ముంబై ఇండియన్స్ జట్టును ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు ఫ్యాన్స్. టీమిండియా మిడిల్ ఆర్డర్ లో సూర్య కుమార్ యాదవ్ మరియు ఈశాన్ కిషన్ కంటే సంజు శాంసన్ చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తాడని… కానీ అతనిపై బీసీసీఐ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు….!

India Squad of World Cup 2023 : సంజూ, ధావన్‌కు చోటు.. సూర్య ఔట్ ?

అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?

Visitors Are Also Reading