Home » రాజేంద్రప్రసాద్ కొడుకు హీరో ఎందుకు కాలేకపోయాడో తెలుసా ?

రాజేంద్రప్రసాద్ కొడుకు హీరో ఎందుకు కాలేకపోయాడో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ లో ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వారసులు లేక బాధపడుతున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్  రజినీకాంత్, కమలహాసన్ లాంటి సూపర్ స్టార్లకు అబ్బాయిలు లేరు. వాళ్ళ అమ్మాయిలే  వారసత్వంగా నిలబెడుతున్నారు. కొంతమంది వారసుడు ఉండి కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయలేకపోతున్నాడు నటకిరీటి రాజేంద్రప్రసాద్. ఇండస్ట్రీలో 40 ఏళ్ల ప్రస్థానం ఉండి.. స్టార్ హీరోగా చక్రం తిప్పిన రాజేంద్రప్రసాద్ తన కొడుకు బాలాజీ ప్రసాద్ ను మాత్రం ఇండస్ట్రీకి పరిచయం చేయలేకపోయాడు. కొండంతా బ్యాక్ గ్రౌండ్ ఉన్న కూడా ఎందుకు తన వారసుడిని హీరో చేయలేకపోయాడు అని ఆయన అభిమానుల్లో ఎప్పటినుంచో ఒక అనుమానం ఉంది. దాని వెనుక ఒక పెద్ద కథ కూడా ఉంది. అందరి హీరోల మాదిరే తన వారసుడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని రాజేంద్రప్రసాద్ ఆశపడ్డాడు. అందుకోసం కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. 

Also Read  :   ఆ సినిమా నాగార్జున చేయాల్సింది… అలా మిస్ అయింది..!

Advertisement

అయితే బాలాజీ ప్రసాద్ చూడడానికి ఆయన తండ్రి రాజేంద్రప్రసాద్ లాగే ఉంటాడు. దీంతో కొడుకును హీరోగా పరిచయం చేయాలంటూ రాజేంద్రుడిని చాలామంది అడిగారు కూడా. ఈ క్రమంలోనే తన కొడుకు బాలాజీ ప్రసాద్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యత రాఘవేంద్రరావు చేతిలో పెట్టాడు రాజేంద్రప్రసాద్. భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, అందరూ దొంగలే వంటి కామెడీ సినిమాలు తీసిన నిధి ప్రసాద్ దర్శకత్వంలో తన కొడుకును పరిచయం చేయాలనుకున్నాడు. సినిమాకి ముహూర్తం కూడా పెట్టారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయలేక పోయింది. చాలా రోజులపాటు ఆగిపోవడంతో బాలాజీ ప్రసాద్ కు సినిమాలపై విరక్తి వచ్చిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి.  

Advertisement

Also Read :  పూరి డైరెక్షన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీని వదులుకొని ఫ్లాప్ మూవీని చేసిన విజయ్… అదే కారణమంట..!

Manam News

తొలి సినిమా విషయంలోని ఇన్ని కష్టాలు ఎదురు కావడంతో ఆయన తట్టుకోలేకపోయాడని.. నటన అంటేనే విసుగు తెచ్చుకున్నాడని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో రాజేంద్రప్రసాద్ ఎంత ఒప్పించాలని చూసినా కూడా తండ్రి మాటను బాలాజీ ప్రసాద్ వినలేదు. ఆ తర్వాత అసలు సినిమాల వైపు చూడలేదు. కావాలంటే నిర్మాతలను తాను తీసుకొస్తానని చెప్పినా కూడా వినలేదంట. అయినా మాట వినకపోవడంతో తానే నిర్మాతగా మారి సినిమా చేస్తానని చెప్పినా కూడా బాలాజీ ప్రసాద్ వినలేదని తెలుస్తోంది. ఎంత చెప్పినా కూడా వినకపోవడంతో కొడుకుని తన ఇష్టానికి వదిలేశాడు రాజేంద్రప్రసాద్. ప్రస్తుతం ఈయన తనకు ఇష్టమైన విదేశాలకి ఎక్స్ పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. అయితే జీవితంలో ఎంత సాధించినా కూడా కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయలేకపోయానని బాధ మాత్రం నటకిరీటి మనసులో అలాగే ఉండిపోయింది.

Also Read :  స్టడీ మూవీలో హీరోయిన్ పాత్రను ఆ స్టార్ హీరోయిన్ వదులుకుందన్న విషయం మీకు తెలుసా ?

Visitors Are Also Reading