Home » పెళ్ళిలో అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారో తెలుసా ?

పెళ్ళిలో అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారో తెలుసా ?

by Bunty
Ad

పెళ్లి అనగానే చాలా రకాల సంప్రదాయాలను ఆచరిస్తూ ఉంటాం. పెళ్లి అనేది చాలా సాంప్రదాయాలతో కూడుకున్న అంశం. పెళ్లి సమయంలో జీలకర్ర బెల్లం పెట్టడం, కాళ్లు కడగడం, తాళి కట్టడం, అలాగే అరుంధతి నక్షత్రం చూపించడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే పెళ్లిలో చాలామందికి అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారు అనే సందేహం ఉంటుంది. వివాహ అనంతరం వధూవరులు ఇద్దరికీ అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం…

Advertisement

పురాణాల ప్రకారం బ్రహ్మ కుమార్తె అయిన సంధ్యాదేవికి ఉపదేశం చేసేందుకు బ్రహ్మచారి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో వారికి వశిష్ట మహర్షి కనిపిస్తారు. ఆ సమయంలో ఆ వ్యక్తి తనకు ఉపదేశం చేసేందుకు తగిన వ్యక్తిగా భావించి అతన్ని అడుగుతారు. ఆ వ్యక్తి ఉపదేశం చేయడానికి ఒప్పుకోరు. ఆ సమయంలో సంధ్యదేవి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. ఆ సమయంలో అగ్ని నుంచి ఒక అందమైన స్త్రీ రూపం వెలువడుతుంది. అందమైన స్త్రీ రూపమే అరుంధతి దేవి. ఆ అందమైన అరుంధతి దేవి రూపాన్ని చూసి వశిష్ట మహర్షి మనసు పారేసుకుంటారు.

Advertisement

తనని వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. అయితే తన పవిత్రతకు పరీక్ష పెట్టాలనే ఉద్దేశంతో వివాహం చేసుకునే సమయంలో వశిష్ట మహర్షి తన చేతిలో ఉన్న కమండలాన్ని అరుంధతికి ఇచ్చి తాను తిరిగి వచ్చేంత వరకు దానిని చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన వశిష్ట మహర్షి తిరిగి రాలేదు. కానీ అరుంధతి మాత్రం ఆ కమండలాన్ని చూస్తూ ఉండేది. తన చూపుని మళ్లించేందుకు ఎందరో మహర్షులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేదు. దీంతో చేసేదేమీ లేక వశిష్ట మహర్షి ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని తన ముందు నిలబెడతారు. ఆ సమయంలో అరుంధతి దేవి తన చూపును వశిష్ట మహర్షి వైపు తిప్పుతుంది. దాంతో అరుంధతి మహా పతివ్రత పేరును సంపాదించుకుంది. అందుకే పెళ్లి అయిన అనంతరం వధూవరులకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు.

ఇవి కూడా చదవండి

40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా సింగల్ గా ఉండిపోయిన హీరోయిన్స్ !

MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

Visitors Are Also Reading