Home » బాలయ్య షో కి తరువాత గెస్ట్ ఎవరో తెలుసా ?

బాలయ్య షో కి తరువాత గెస్ట్ ఎవరో తెలుసా ?

by Anji
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అంతా రెండో సీజన్ గ్రాండ్ గా ప్రారంభమైంది తన వియ్యంకుడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అతని కుమారుడు నారాలోకేష్ లతో జరిగిన మొదటి ఎపిసోడ్ ఆద్యంతం ఆకట్టుకుంది. అన్ స్టాపబుల్ షోలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, బాలయ్య రెస్పాన్స్ పొలిటికల్ హిట్ పుట్టించాయి కూడా. ఈ విషయం పక్కన పెడితే ఎప్పటిలాగే బాలయ్య తనదైన శైలి, మేనరిజంతో ఆకట్టుకున్నారు. బావ, అల్లుడితో కలిసి వినోదం పండించారు.

Advertisement

మొదటి ఎపిసోడ్ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి రెండో ఎపిసోడ్ పై పడింది. ఈసారి బాలయ్య షోకు ఎవరు వస్తారు అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆహా యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్ లో ఓ ఆసక్తి కరమైన పోస్ట్ షేర్ చేసింది.గెస్ ది గెస్ట్ ఆఫ్ ఎపిసోడ్-2′ అంటూ తర్వతి ఎపిసోడ్ కు వచ్చే గెస్ట్ లు ఎవరో గెస్ చేయడంటూ రెండు పజిల్స్ ను షేర్ చేసింది ఆహా యాజమాన్యం.

Advertisement

Also Read : చంద్ర‌బాబు లైఫ్‌లో బిగ్ అల‌య‌న్స్ ఏంటో తెలుసా..?

మొదటి పజిల్ ను పరిశీలిస్తే డీజే టిల్లు భామ నేహా శెట్టి ఈ టాక్ షోకి వస్తున్నారని దాదాపుగా అర్థమవుతుంది. ఫ్యాన్స్ కూడా అదే కామెంట్ చేస్తున్నారు. అయితే రెండో పజిల్ కాస్త క్లిష్టంగా ఉంది.అయితే అశోకవనంలో అర్జున కళ్యాణంతో ఆకట్టుకున్న హీరో విశ్వక్ సేని అని కొందరు అంటుంటే, సిద్దు జొన్నలగడ్డ అని మరికొందరు చెబుతున్నారు. మరి మీరు ఈ పజిల్స్ పై ఓ లుక్కేయండి. బాలయ్య షో తర్వాతి ఎపిసోడ్ కు గెస్టులెవరో ఎవరో కనుక్కోండి చూద్దాం.

Also Read :  కుర్ర‌హీరోల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించిన హ‌రికృష్ణ సినిమా ఏదో తెలుసా..? ఆ సినిమా రికార్డులు ఇవే..?

Visitors Are Also Reading