పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో కూడా చాలా చురుకుగా పాల్గొంటున్నారు. నందమూరి తారకరామారావు మాదిరిగా సినిమాలు, రాజకీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ రాణిస్తున్నారు. అయితే గడిచిన కొన్నేళ్ల క్రితం మూడో భార్య అన్నాలేజీనోవాను పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్. త్వరలోనే నాలుగో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Advertisement
తాజాగా పవన్ కళ్యాణ్ గురించి వేణు స్వామి మరోసారి పెళ్లి, విడాకుల వ్యవహారం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గురించి నేను మాట్లాడినా మాటలు చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కి తాను కూడా పెద్ద అభిమానిని. జల్సా సినిమా విడుదల సమయంలో పేపర్లు చింపి థియేటర్ లో నానా రచ్చ చేశాను. పవన్ కళ్యాణ్ సినిమాల్లో సక్సెస్ అయినంతగా రా
Advertisement
pawan-kalyan-and-Third-wife-anna
జకీయాల్లో కాలేరని చెబితే అభిమానులకు అది నచ్చదు. పర్సనల్ గా పవన్ కళ్యాణ్ కి తమకు ఎలాంటి విభేదాలు లేవని.. 2024 తరువాత ఏం జరుగుతుందో చెప్పలేమని.. ఎన్నికలు జరిగే వరకు విడాకులు జరగవు అంటూ వేణు స్వామి వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా మరింత ఎదగాలని కోరుకునే వారిలో నేను కూడా ఒకడిని. అయితే పవన్ కళ్యాణ్ మనోభావాలు వేరే రకంగా ఉన్నాయని.. తాను పవన్ గురించి ఎన్ని నిజాలు చెప్పినా కూడా ఆయన అభిమానులు తనను ట్రోల్ చేస్తూనే ఉంటారని తెలిపారు. పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ విషయం గురించి వేణు స్వామి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక 2025లో మూడో భార్యతో విడాకులు తీసుకొని అవకాశం ఎక్కువగా ఉందంటూ వేణు స్వామి చెప్పిన మాటలను బట్టి తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆశ్యర్యపోతున్నారు. వేణు స్వామి గతంలో చెప్పినవి కొన్ని నిజాలు కూడా అయ్యాయి.
Also Read :