Home » కళాతపస్వి కె విశ్వనాథ్ వారసులు సినిమాల్లోకి రాకపోవడానికి కారణమేంటో తెలుసా ?

కళాతపస్వి కె విశ్వనాథ్ వారసులు సినిమాల్లోకి రాకపోవడానికి కారణమేంటో తెలుసా ?

by Anji
Ad

కళాతపస్వి కె.విశ్వనాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరనే  విషయం అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 02, 2023న రాత్రి ఆయన అనారోగ్య సమస్యతో కన్నుమూశారు. ఫిబ్రవరి 02 రోజే కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణం విడుదలైంది. శంకరాభరణం చిత్రం విడుదలైన రోజే కె.విశ్వనాథ్ మరణించడం విశేషం. అయితే కళాతపస్వి విశ్వనాథ్ వారసులు సినిమాల్లోకి రాకపోవడానికి కారణం ఏంటనే ప్రశ్నకు అభిమానుల్లో చాలా మందికి సమాధానం తెలియదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో విశ్వనాథ్ మాట్లాడుతూ.. షాకింగ్ విషయాలను వెల్లడించడం గమనార్హం. 

Advertisement

సినిమా వాళ్లం పిరికి వాళ్లమని.. కోట్ల రూపాయలతో బిజినెస్  చేస్తామని విశ్వనాథ్ పేర్కొన్నారు. భయాలు, సెంటిమెంట్ల వల్లనే ఎస్ అనే లెటర్ తో వరుసగా సినిమాలు చేశానని.. ఆయన కామెంట్స్ చేశారు. ఆపద్భాందవుడు ఈ చిత్రానికి మాత్రం ఈ సెంటిమెంట్ ని మిస్ చేశానని.. వెల్లడించారు విశ్వనాథ్. కథ రాసుకునే సమయంలో నేను లిరిక్స్ కూడా రాస్తానని.. ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. నేను రాసిన పల్లవులను సినిమాల్లో ఉంచిన సందర్భాలు ఉన్నాయని.. విశ్వనాథ్ పేర్కొన్నారు. కొన్ని పాటలు నేనే రాశానని.. పేరు మాత్రం వేసుకోలేదు అని చెప్పుకొచ్చారు. తాను పాటలు రాస్తానని చెబితే జనాలు నమ్ముతారో లేదో అనిపించిందని విశ్వనాథ్ కామెంట్స్ చేశారు.  

Advertisement

Also Read :  బాహుబలి సినిమాలో ఈ సీన్ గమనించారా…? మీకూ అదే డౌట్ వచ్చిందా..!

“నాకు పబ్లిసిటీ అనేది నచ్చదు అని పేర్కొన్నారు. నా కుటుంబ సభ్యులు సినిమాల్లోకి రావడానికి నేను వాళ్లను ప్రోత్సహించలేదు. నా కుటుంబ సభ్యులు ఇక్కడ రాణిస్తారని.. నాకు అస్సలు నమ్మకం లేదని కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో పైకి రావడం అంత సులువు ఏమి కాదని.. టాలెంట్ ని గుర్తించే విషయంలో అప్పట్లో చాలా మంది ఉండేవారు అని.. మనీ విషయంలో పేరు ప్రఖ్యాతుల విషయంలో ఇండస్ట్రీలో అనిశ్చితి ఉన్నదని విశ్వనాథ్ పేర్కొన్నారు. ఈ రీజన్ వల్ల మా పిల్లలను వేరే రంగాల్లో స్థిరపడేవిధంగా చేసానని తెలిపారు విశ్వనాథ్. ఆయన అభిమానులను ఎంతగానో బాధ పెడుతుందని తెలుస్తోంది.  

Also Read :  “భాషా” సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా..? ఎందుకు నో చెప్పారంటే..?

Visitors Are Also Reading