సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు నటనతో పాటు కొన్ని సందర్భాల్లో నిర్మాత, దర్శకత్వం బాధ్యతలు కూడా వ్యవహరిస్తారు. అది కేవలం హీరోలకు మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ తాజాగా హీరోయిన్స్ కూడా నటనతో పాటు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
కృతి సనన్ :
కృతి సనన్ సరికొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. బ్లూ బటర్ ప్లై ఫిలింను స్టార్ చేసి దో పత్తి అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. కాజోల తో కలిసి తాను కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో నేరుగా ఓటీటీలో విడుదల కానుంది దో పత్తి.
ఆలియా భట్ :
ఆల్రెడి డార్లింగ్ సినిమాను తెరకెక్కించారు ఆలియా. ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్ అని వెతికి మరీ పేరు పెట్టుకున్నారు ఈ బ్యూటీ. నటిగా బిజీగా ఉన్నా.. నిర్మాతగా మంచి ప్రాజెక్టులు చేయాలనే సంకల్పంతో ఉన్నారు ఆలియా భట్.
కంగనారనౌత్ :
Advertisement
కంగనారనౌత్ పేరు చెప్పగానే మణికర్ణిక మూవీ గుర్తుకొస్తుంది. మణికర్ణిక ఫిలిం బ్యానర్ మీదనే ఎమర్జెన్సీ మూవీని తెరకెక్కిస్తున్నారు కంగనా. మిగిలిన బ్యానర్లలోనే కాదు.. సొంత బ్యానర్ లో కూడా నటిగా కంటిన్యూ అవుతున్నారు.
నయనతార :
భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి నయనతార కూడా కంటిన్యూస్ సినిమాలను చేస్తున్నారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్ కి కోలీవుడ్ లో మంచి పేరుంది. రీసెంట్ గా కేఆర్ కే మూవీ అదే బ్యానర్ పై తెరకెక్కించారు.
తాప్సీ :
ఔట్ సైడర్స్ ఫిలింస్ అనే బ్యానర్ ని స్టార్ట్ చేశారు తాప్సీ. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయినా సందర్భంగా ప్రొడక్షన్ హౌస్ గురించి ఆలోచించినట్టు తెలిపారు తాప్సీ ఈ బ్యానర్ మీదనే బ్లర్ మూవీని తెరకెక్కించారు. కాస్త అడపాదడపా పలువురు హీరోయిన్లు నిర్మాతలుగా మారుతున్నా.. వీరు మాత్రం డెడికేటెడ్ గా సినిమాలను తీస్తామని పదేపదే చెబుతుండటం విశేషం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
రానా పై దుల్కర్ సల్మాన్ అలాంటి కామెంట్స్ చేశాడా ? సోషల్ మీడియాలో వైరల్..!