Home » పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీకి సంజయ్ దత్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా ?

పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీకి సంజయ్ దత్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా ?

by Anji
Ad

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత సౌత్ ఇండియాలో వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ మూవీలో విలన్ రోల్ లో నటించి మెప్పించాడు సంజయ్ దత్. ప్రస్తుతం పూరిజగన్నాథ్-రామ్ కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీతో పాటు.. తమిళ హీరో విజయ్ దళపతి-లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న లియో మూవీలో కూడా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ రెండు సినిమాలకు సంబంధించి సంజయ్ లుక్స్ విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. 

Advertisement

ఇక డబుల్ ఇస్మార్ మూవీలో నటించేందుకు సంజయ్ దత్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఛార్జ్ చేసాడని సమాచారం. ఈ సినిమా కోసం దాదాపు 60 రోజులకు పైగా డేట్స్ కేటాయించాడట. అయితే అందుకు రూ.15కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట సంజూ భాయ్. లైగర్ మూవీ డిజాస్టర్ అందుకున్న తరువాత పూరిజగన్నాథ్, చార్మి ఈ సినిమాతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలనే కసితో ఉన్నారు. మరోవైపు హీరో రామ్ కి కూడా ఇటీవల చెప్పుకోదగిన హిట్ లేదు. 

Advertisement

ఈ నేపథ్యంలో ఈ సినిమా వీరికి చాలా కీలకంగా మారింది. ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయిన ఈ చిత్రాన్ని 2024 మార్చి 08న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్. ఇటీవలే బేబి మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి విలన్ రోల్స్ కి షిప్ట్ అయిన సంజూ భాయ్ కేజీఎఫ్ మూవీ ద్వారా వచ్చిన క్రేజ్ తో రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేశాడు. ఇస్మార్ట్ శంకర్ కి ముందు కూడా రామ్ కి సరైన హిట్ లేని సమయంలో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ కూాడా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఏం జరుగుతుందనేది కొద్ది రోజులు వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

మెగాస్టార్ చిరంజీవి చేతికి ఉన్న వాచ్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

హరోంహర అత్తిలి చిరబర.. బ్రహ్మాస్త్ర 2 ఇక లేనట్టేనా ? 

Visitors Are Also Reading