తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు నేడు జరుగుతున్నాయి. మొదట CDS జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ భౌతిక అవశేషాలను వారి నివాసానికి తీసుకువచ్చారు. తరువాత అంత్యక్రియలు ప్రారంభించారు. ఒక సైనికుడు అమరుడైతే, అతని అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తారు. ముందుగా అమరవీరుడి మృతదేహాన్ని ఆర్మీ సిబ్బందితో పాటు అతని స్థానిక నివాసానికి పంపుతారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే సమయంలో మృతదేహానికి త్రివర్ణ పతాకం కప్పుతారు.
Advertisement
Advertisement
Advertisement
ఇండియన్ ఫ్లాగ్ కోడ్ 2002 ప్రకారం జాతీయ జెండాను సైనికులు లేదా రాష్ట్ర గౌరవాల సమయంలో మృతదేహాన్నీ కప్పొచ్చు. జెండా అశోక చక్రం పైభాగంలో ఉంటుంది. జెండాను భౌతికకాయం ఉంచిన పెట్టెపై కప్పుతారు. జెండాను ఎప్పుడూ సమాధిలో పాతిపెట్టరు లేదా చితిలో కాల్చరు. అంత్యక్రియలకు ముందు ఈ జెండాను అమరవీరుడి కుటుంబ సభ్యులకు అందజేస్తారు. రాష్ట్ర, సైన్యం, కేంద్ర పారామిలటరీ బలగాల కోసం నిర్వహించే అంత్యక్రియలకు తప్ప ఎక్కడా ఏ రూపంలోనూ జెండాను ఉపయోగించకూడదు. అంత్యక్రియల సమయంలో మిలిటరీ బ్యాండ్ ‘సందాన సంగీతం’ ప్లే చేస్తారు. దాని తర్వాత గన్ సెల్యూట్ ఉంటుంది. గన్ సెల్యూట్ ప్రత్యేక పద్ధతి కూడా ఉంది. దీనిలో తుపాకీని వంచి, ప్రత్యేక పద్ధతిలో పైకి లేపుతారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుల గౌరవార్థం ఇలా చేస్తారు.