Home » హాలీవుడ్ స్టేజ్ పై టాలీవుడ్ సినిమా ఏదో తెలుసా ?

హాలీవుడ్ స్టేజ్ పై టాలీవుడ్ సినిమా ఏదో తెలుసా ?

by Anji
Ad

గడిచిన పదేళ్ల కాలంలో తెలుగు సినిమా ఖ్యాతి ఎంతవరకు విస్తరించిందో దాదాపు అందరికీ తెలిసిందే. ప్రాంతీయ భాషకు సంబంధించిన సినిమాలను చిన్న చూపు చూసిన తెలుగు సినిమాను ప్రపంచ స్థాయి సినిమాలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్తున్నారు టాలీవుడ్ దర్శకులు. అయితే ఈ ఘనతకు మాత్రం పునాది వేసింది దర్శక ధీరుడు రాజమౌళి అనే చెప్పవచ్చు. దానిని యువ దర్శకుడు నాగ్ అశ్విన్ మరింత ముందుకు తీసుకెళ్తున్నాడు. 

Advertisement

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి 2898AD సినిమా గ్లింప్స్ విడుదల కార్యక్రమం కాలిఫోర్నియాలోని శాన్ డియాగో ఘనంగా నిర్వహించిన విషయం విధితమే. అయితే ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమోను యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రభాస్, రానా, నాగ్ అశ్విన్, కమల్ హాసన్, స్వప్నదత్, ప్రియాంక దత్ హాజరైన ఈ ఈవెంట్ అట్టహాసంగా జరిగినట్టు ప్రోమో ద్వారా తెలుస్తుంది. తెలుగు మవీని కామిక్-కాన్ ఈవెంట్ లో ప్రజెంట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందంటూ ప్రియాంక చెప్పిన మాటలు ప్రోమోలో హైలెట్ గా నిలిచాయి.

Advertisement

అదేవిధంగా నిర్మాత అశ్వినిదత్ మాట్లాడుతూ.. తనకు ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ వంటి వారితో వర్క్ చేయడానికి తన 50 ఏళ్ల కెరీర్ లో ఇప్పుడు సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. కల్కీ 2898 గ్లింప్స్ వీడియోకి అక్కడి ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్ చాలా అద్భుతంగా ఉంది. గ్లింప్స్ ప్లే చేయగా.. అరుపులు కేకలతో అక్కడి ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. టీజర్ ముగిసిపోగానే వన్స్ మోర్ అరుస్తూ కేరింతలు కొట్టారు. దీనిని బట్టి చూస్తే.. తెలుగు సినిమాకి హాలీవుడ్ స్టేజ్ పై ఎంతటి గౌరవం దక్కిందో ఇట్టే తెలుస్తోంది. ఈ ఈవెంట్ కి హీరోయిన్ దీపికా పదుకునే గైర్హాజరైంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ కనుక సూపర్ హిట్ అయితే తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మెగాస్టార్ బోళాశంకర్ సెన్సార్ పూర్తి.. అదే హోప్..!

Bro: “బ్రో” సినిమాలో ఆ ఒక్క షాట్ కు అంత ఖర్చు చేసారా? ఏకంగా ఇంకో మూవీ తీయొచ్చుగా!

 రామ్ చరణ్ కూతురికి అల్లు అర్జున్ అదిరిపోయే గిప్ట్..! 

Visitors Are Also Reading