Home » లైగ‌ర్ ప‌రాజ‌యం కావ‌డానికి ద‌ర్శ‌కుడు సుకుమార్ కార‌ణ‌మా..?

లైగ‌ర్ ప‌రాజ‌యం కావ‌డానికి ద‌ర్శ‌కుడు సుకుమార్ కార‌ణ‌మా..?

by Anji
Ad

పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పాన్ ఇండియా మూవీ లైగ‌ర్ ఘోర ప‌రాజ‌యాన్ని చూసి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. రామ్ హీరోగా న‌టించిన ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్సెస్ త‌రువాత పూరి నుంచి వ‌చ్చిన సినిమా కావ‌డం, మ‌రోవైపు పాన్ ఇండియా లెవ‌ల్‌లో వ‌స్తుంద‌ని విడుద‌ల‌కు ముందే ఈ సినిమాపై అభిమానులు భారీగానే అంచ‌నాలు పెట్టుకున్నారు. ఈ సినిమా క‌నీసం అంచ‌నాల‌ను అందుకోలేక‌పోవ‌డం చూసి షాక్ అవుతున్నారు.

Advertisement

ముఖ్యంగా మ‌హేష్ బాబుతో పోకిరి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని తీసిన పూరిజ‌గ‌న్నాథ్ ఇలాంటి ఫెయిల్యూర్ సినిమా ఎందుకు తీశాడ‌ని అత‌ని స‌న్నిహితుల‌కు కూడా స‌మాధానం లేని ప్ర‌శ్న‌గా మారింది. ఇక ఈ సినిమా విడుద‌ల‌కు ముందు ప్ర‌మోష‌న్‌ల విష‌యంలో హైప్ తీసుకురావ‌డానికి ఎన్ని మార్గాలుంటాయో అన్ని మార్గాలను అనుస‌రించాడు. ఇటీవ‌ల కాలంలో ఒక ద‌ర్శ‌కుని సినిమాను మ‌రో ద‌ర్శ‌కుడు ప్ర‌మోట్ చేయ‌డం ఒక ప‌ద్ద‌తిగా మారిన ప‌రిస్థితుల్లో ద‌ర్శ‌కుడు సుకుమార్ లైగ‌ర్ ప్ర‌మోష‌న్ కోసం త‌న‌వంతు సాయం చేశారు. పూరిజ‌గ‌న్నాథ్‌-సుకుమార్ క‌లిసి ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పూరి చేసిన ఓ కామెంట్ విని చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు.

Advertisement

పుష్ప క్లైమాక్స్ ని చూసి దానికి ప్ర‌భావితం అయి తాను లైగ‌ర్ మూవీ క్లైమాక్స్ రాశాన‌ని పూరి చేసిన కామెంట్లు విన్న‌వారంద‌రూ షాక్‌కి గురయ్యారు. వాస్త‌వానికి పుష్ప క్లైమాక్స్ వ‌చ్చే సరికి ఆ సినిమాని చూస్తున్న ప్రేక్ష‌కుడు అల్లు అర్జున్ న‌టించిన పుష్ప‌రాజ్ పాత్ర‌తో పూర్తిగా క‌నెక్ట్ అయిపోయారు. అలాంటి ఫీల్ లైగ‌ర్ క్లైమాక్స్ చూస్తున్న‌ప్పుడు క‌నీసం విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానుల‌కు అయినా క‌లిగిందా అంటూ కొంద‌రూ జోక్ చేస్తున్నారు. మైక్ టైస‌న్ లాంటి అంత‌ర్జాతీయ బాక్స‌ర్‌ను ప‌ట్టుకొచ్చి ఎలాంటి ప‌స‌లేని క్లైమాక్స్‌ని పూరి పుష్ప‌ను చూసి రాశాడా అని కొంద‌రు చేసిన కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి. ఇక వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌కి లైగ‌ర్ మ‌రో పీడ‌క‌ల‌లా మారింద‌నే చెప్పాలి.

ఇది కూడా చ‌ద‌వండి :  RRR, KGF 2, కార్తికేయ 2 తో స‌హా బాలీవుడ్ లో ఎక్కువ వ‌సూళ్లు సాధించిన సినిమాలు ఇవే..!

Visitors Are Also Reading