Home » ఉదయ్ కిరణ్ సినిమాలో నటించిన వారంతా మరణించారనే విషయం మీకు తెలుసా ?

ఉదయ్ కిరణ్ సినిమాలో నటించిన వారంతా మరణించారనే విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్థాంతరంగా లైఫ్ ముగించుకున్న స్టార్ నటులలో ఉదయ్ కిరణ్ ఒకరు. 2001లో తెలుగు ఇండస్ట్రీని మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న హీరో ఉదయ్ కిరణ్. అలాంటి నటుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పట్లో లవ్ బాయ్ గా అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉండేవారు ఉదయ్ కిరణ్. తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉ*సుకొని మరణించారు. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఉదయ్ కిరణ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Advertisement

ఇంతకు అది ఏంటంటే.. తేజ దర్శకత్వంలో 2001లో విడదలైన నువ్వునేను మూవీ సూపర్ హిట్ సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు అప్పట్లో పలు విభాగాల్లో అవార్డులు కూడా అందాయి. ఇక ఈ చిత్రంలోని పాటలు అద్భుతమనే చెప్పాలి. అలాంటి చిత్రానికి దర్శకుడు తేజకు నంది అవార్డు వరించింది. అంతేకాదు.. నాలుగు ఫిల్మ్ ఫెయిర్ అవార్డులు కూడా రావడం హిస్టరీ అనే చెప్పాలి. ఈ సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ కి ఎంతో పేరు వచ్చింది.

Advertisement

 

అలాంటి ఈ సినిమాలో నటించిన ఈ నటులు మాత్రం ఇప్పుడు లేరు. ఇందులో హీరోగా చేసిన ఉదయ్ కిరణ్ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఉదయ్ కిరణ్ తో పాటు ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇందులో కీలక పాత్రలు పోషించారు. వారు కూడా మరణించారు. అదేవిధంగా ఆహుతి ప్రసాద్ అనారోగ్యంతో మరణించారు. ఉదయ్ కిరణ్ తండ్రి పాత్ర పోషించినటువంటి వైజాబ్ ప్రసాద్ కూడా కన్ను మూశారు. ఈ సినిమాలో ఇంత మంది స్టార్ నటులు ప్రస్తుతం లేకపోవడం గమనార్హం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఎన్టీఆర్ ఫ్యాన్ శ్యామ్ ప్రేమించిన అమ్మాయి ఎవరు..? మరో కొత్త ట్విస్ట్..!

 Allu Arjun: AAA మల్టీప్లెక్స్ కాకుండా హైదరాబాద్ లో అల్లు అర్జున్ చేసే ఈ బిజినెస్ ల గురించి తెలుసా?

Visitors Are Also Reading