Home » వాళ్ళను నమ్మలేని కేసీఆర్…? స్వయంగా రంగంలోకి…?

వాళ్ళను నమ్మలేని కేసీఆర్…? స్వయంగా రంగంలోకి…?

by Venkatesh
Ad

హుజూరాబాద్ ఫలితాల తర్వాత సిఎం కేసీఆర్ కాస్త సీరియస్ గా ఫోకస్ పెట్టి జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. ఇప్పుడు కొన్ని జిల్లాల మీద స్పెషల్ ఫోకస్ చేసిన ఆయన అభివృద్ధిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. రేపు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉంటుంది అని తెరాస పార్టీ వర్గాలు చెప్పాయి.

Advertisement

Advertisement

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం … సమీక్ష కూడా చేసే అవకాశం ఉంది. సీఎం పడెన్ ట్రిప్ తో అధికారుల హైరానా అంతా ఇంతా కాదు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఇప్పుడు సిఎం పర్యటన ఏర్పాట్లు చేస్తుంది. వరంగల్ ప్రజాప్రతినిధులపై సీఎం కేసీఆర్ కాస్త సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. గతంలో తాను సూచించిన పనులకు కూడా దిక్కులేకపోవడం వల్లే సీఎం రంగంలోకి దిగారని కొందరు అభిప్రాయపడుతున్నారు. పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలపై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో సీఎం సమీక్ష కూడా నిర్వహిస్తారు. దేవన్నపేటలో విజయ ఘర్జన సభ ఏర్పాట్లను కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉంది.

Visitors Are Also Reading