Home » కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చిరు బాల‌య్య మ‌ల్టీస్టార‌ర్ ఎందుకు ఆగిపోయింది..? కార‌ణం వాళ్లేనా.?

కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చిరు బాల‌య్య మ‌ల్టీస్టార‌ర్ ఎందుకు ఆగిపోయింది..? కార‌ణం వాళ్లేనా.?

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి బాలకృష్ణ కాంబినేషన్లో మల్టీస్టారర్ రాబోతోంది అంటూ టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దానికి కారణం బాలయ్య హోస్ట్ గా చేస్తున్న టాక్ షోలో మ‌ల్టీ స్టార‌ర్ ప్రస్తావన రావడమే. టాక్ షోలో బాలయ్య మాట్లాడుతూ…. తాను చిరంజీవి కలిసి మల్టీ స్టార‌ర్ చేస్తే అది పాన్ వరల్డ్ సినిమా అవుతుందని కామెంట్ చేశారు. దాంతో చిరంజీవితో మల్టీస్టార‌ర్ చేయడానికి బాలయ్య రెడీ అన్నట్టే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ మల్టీస్టార‌ర్ పై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ సినిమా జర్నలిస్ట్ భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

chiranjeevi-balayya

Advertisement

చిరంజీవి బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా చేయాలని దర్శకుడు కోదండరామిరెడ్డి ప్రయత్నించార‌ని చెప్పారు. ఆ ఇద్దరు హీరోలు కూడా ఆసక్తి చూపించినప్పటికీ అది ఎందుకు జరగలేదో తెలియదని అన్నారు. అంతే కాకుండా వారిద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవని చెప్పారు. కేవలం ఫ్యాన్స్ మధ్య ఉన్నాయని భరద్వాజ అభిప్రాయపడ్డారు.

Advertisement

అంతేకాకుండా బాలకృష్ణ ఇంట్లో బెల్లంకొండ సురేష్ మీద జరిగిన కాల్పుల ఘటన జరిగిన తర్వాత బాలయ్యను హాస్పిటల్ కు తీసుకువెళ్లారని చెప్పారు. అయితే చాలా సేపు అల్లు అరవింద్ చిరంజీవి ఆ సమయంలో బాలకృష్ణ వద్దనే ఉన్నారని అన్నారు. ఈ విషయం అప్పుడు దినపత్రికలను ఎక్కువగా ఫాలో అయ్యే వారందరికీ తెలుసని అన్నారు.

అంతేకాకుండా బాలయ్య చిరుతో కలిసి మల్టీస్టారర్ నిర్మిస్తానని అల్లు అరవింద్ చేసిన కామెంట్ల పై కూడా భరద్వాజ స్పందించారు. వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేయగల డైరెక్టర్, కథ రెండూ దొరికితే ఖచ్చితంగా అది పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అవుతుందని అన్నారు. రాజమౌళి ఇప్పటికే రామ్ చరణ్ తారక్ తో కలిసి సినిమా చేశారు కాబట్టి ఆయనకు బాలయ్య చిరంజీవితో సినిమా చేయాలని ఉందని అన్నారు.

Visitors Are Also Reading