Home » బాల‌య్య‌ చిరు మ‌ల్టీస్టారర్…మైత్రీమూవీమేక‌ర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

బాల‌య్య‌ చిరు మ‌ల్టీస్టారర్…మైత్రీమూవీమేక‌ర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

by AJAY
Ad

టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి బాల‌య్యల సినిమాలు వేరు వేరుగా విడుద‌ల‌యితేనే బాక్స్ ఆఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర ఉంటుంది. అలాంటిది వీరిద్ద‌రి కాంబోలో ఓ సినిమా వ‌స్తే ఏ రేంజ్ లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రంలేదు. కానీ త‌ప్ప‌కుండా ఎన్టీఆర్ రామ్ చ‌ర‌ణ్ కాంబో కంటే ఎక్కువ క్రేజ్ వ‌స్తుంది. దానికి కార‌ణం ప్రస్తుతం యువ హీరోలు చాలామంది మ‌ల్టీ స్టార‌ర్ లు చేస్తున్నారు. కానీ సీనియ‌ర్ హీరోలు మాత్రం మ‌ల్టీ స్టార‌ర్ లు చేయడం చాలా అరుద‌నే చెప్పాలి. కాబ‌ట్టి బాల‌య్య మెగాస్టార్ మ‌ల్టీ స్టారర్ అన‌గానే ఒక రేంజ్ లో హైప్ వ‌స్తుంది.

Advertisement

chiranjeevi balakrishna

chiranjeevi balakrishna

అయితే వీరిద్ద‌రి కాంబోలో మ‌ల్టీ స్టారర్ సినిమా రాబోతుంద‌ని గ‌త కొద్దిరోజులుగా ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు చెక్క‌ర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మిస్తుంద‌ని కూడా వార్తలు వ‌స్తున్నాయి. టాలీవుడ్ లో ప్ర‌స్తుతం మైత్రీ మూవీమేక‌ర్స్ టాప్ నిర్మాణ‌సంస్థ‌గా రాణిస్తోంది. వ‌రుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ టాప్ హీరోల డేట్ ల‌ను మందుగానే బుక్ చేసుకుంటుంది. ఇక ప్ర‌స్తుతం అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప సినిమాను కూడా మైత్రి మూవీ మేక‌ర్స్ వారే నిర్మించారు.

Advertisement

అయితే ఈ సినిమాకు సంబంధించి నిర్వ‌హించిన ఓ ప్రెస్ మీట్ లో నిర్మాత‌లు ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మీ బ్యాన‌ర్ లో చిరంజీవి బాల‌కృష్ణ ల మ‌ల్టీ స్టార‌ర్ సినిమా రాబోంతుంద‌ని అంటున్నారు. నిజ‌మేనా అంటూ ప్ర‌శ్నించ‌గా వారు మాట్లాడుతూ….చిరంజీవి బాల‌కృష్ణ‌ల‌తో సినిమా తీసే అవకాశం వ‌స్తే ఎవ‌రు వ‌దులుకుంటారు అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇక మైత్రీ మూవీమేక‌ర్స్ చేసిన కామెంట్ల‌తో బాల‌య్య చిరు కాంబోలో సినిమాపై మ‌రింత ఆస‌క్తి నెల‌కొంది.

Visitors Are Also Reading