పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీ సార్టర్లుగా తెరకెక్కిన బ్రో చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. తమిళ సినిమా వినోదయ సీతంకు రీమేక్ గా వచ్చిన బ్రో చిత్రాన్ని తెలుగు మరియు తమిళ భాషల్లో సముద్రఖనియే దర్శకత్వం వహించారు. కాగా దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా రూపొందించారు. కేవలం 21 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
Advertisement
అయితే.. ఈ సినిమా విడుదల అయ్యాక మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా మొత్తానికి ఈ సన్నివేశమే హైలైట్ గా నిలిచింది. ఒక సాధారణ ఓటిటి చిత్రాన్ని రీమేక్ చేసి ఇంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం పవన్ కళ్యాణ్ కె సాధ్యం అయ్యింది. ఈ సినిమా మొత్తంలోనూ ఇంటర్వెల్ సన్నివేశానికి చాలా హైప్ క్రియేట్ అయ్యింది.
Advertisement
అయితే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి మొత్తం 200 కెమెరాలను వాడారట. ఆ సన్నివేశానికి తగ్గట్లు లైటింగ్ ని అరెంజ్ చేయడానికి చాలానే ఖర్చు చేసారు. ఈ ఒక్క షాట్ కోసమే దాదాపు మూడు కోట్ల రూపాయలను ఖర్చు చేశారట. ఈ విషయం తెలియగానే ఒక్క షాట్ కి అన్ని కోట్లా.. ఇంకో చిన్న బడ్జెట్ మూవీ తీసేయచ్చు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
యూట్యూబర్ నెల ఆదాయం రూ. 30 లక్షలు.. నెంబర్ వన్ యూట్యూబర్ గా AP వాసి !
అఖిల్ పుట్టాక అమల సంచలన నిర్ణయం.. నాగచైతన్య కోసమే ?