Home » ‘భీమ్లా నాయక్’ పోస్ట్ పోన్ అవుతుందా? నిర్మాత క్లారిటీ..

‘భీమ్లా నాయక్’ పోస్ట్ పోన్ అవుతుందా? నిర్మాత క్లారిటీ..

by Bunty
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరో రానా కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం కు ఇది రీమేక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన.. నిత్యామీనన్ నటిస్తుండగా… రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తోంది.

Advertisement

మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదురా నా ఫ్యాన్స్ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు మరియు టీజర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Advertisement

అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా మా విడుదల వాయిదా పడుతుందని రూమర్స్ వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా కోసం భీమ్లా నాయక సినిమా విడుదల తేదీని మార్చుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఇలాంటి తరుణంలో తాజాగా చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. భీ మ్లా నాయక్ సినిమాను జనవరి 12 వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ తేదీలో ఎలాంటి మార్పు లేదని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా వదలింది చిత్రబృందం. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నెలకొంది.

Visitors Are Also Reading