Home » సీఎం జగన్ పై బాలయ్య సెటైర్లు… టీజర్ లో డైలాగ్స్ వైరల్ ?

సీఎం జగన్ పై బాలయ్య సెటైర్లు… టీజర్ లో డైలాగ్స్ వైరల్ ?

by Bunty
Ad

నందమూరి బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు నందమూరి బాలయ్య. ఇప్పటికే అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు బాలయ్య. ఈ తరుణంలోనే మరో ప్రాజెక్టు చేసేశాడు బాలయ్య బాబు. నందమూరి బాలయ్య మరియు అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంతు కేసరి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ఇటీవల కాలంలోనే ప్రకటించారు. ఇక ఇందులో బాలయ్య సరసన కాజల్ నటిస్తోంది. అటు శ్రీ లీల బాలయ్య కూతురుగా కనిపించే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం అవుతుంది.

bhagavath-kesari-dialogues

bhagavath-kesari-dialogues

ఇది ఇలా ఉండగా మొన్న బాలయ్య పుట్టినరోజు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భగవంతు కేసరి టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు యూట్యూబ్లో ట్రైడింగ్ లోనే ఉంది. ఇక ఈ టీజర్ రిలీజ్ కాగానే బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు.

Advertisement

Advertisement

ఇది ఇలా ఉండగా ఈ టీజర్ పై వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ ఔవుతోంది. భగవత్ కేసరి సినిమా టీజర్ లో బాలయ్య బాబు చెప్పిన డైలాగ్స్ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చెప్పినట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

రాజు ఆడి వెనుక ఉన్న వందల మందిని చూపిస్తాడు… మొండోడు ఆడికి ఉన్న ఒకే ఒక గుండెను చూపిస్తాడు… అడవి బిడ్డ నేలకొండ భగవంతు కేసరి అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ఈ టీజర్ కు హైలైట్ గా మారింది. అయితే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ అగ్ర నేతలపై వైసీపీ నాయకులు వరుసగా కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగుదేశం పార్టీ నేత ఒక్కరు మాట్లాడితే వైసీపీ నేత లు పదుల సంఖ్యలో మాటల దాడి చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో బాలయ్య ఈ డైలాగ్ చెప్పాడని కొంతమంది అంటున్నారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

అప్సర కేసులో అదిరిపోయే ట్విస్ట్! ఇది అస్సలు ఊహించలే కదా ?

4 గురు పెళ్ళాలు ఉన్నా… ఒంటరోడే నా దేవుడు – శ్రీ రెడ్డి

రేణు దేశాయ్‌ – పవన్ కళ్యాణ్ విడిపోవడానికి నాగబాబు కారణమా?

Visitors Are Also Reading