Home » ఈ సారి నాగార్జున ను టార్గెట్ చేసిన బాలయ్య..? ఆ కామెంట్స్ వెనక అర్థం ఏంటి..!

ఈ సారి నాగార్జున ను టార్గెట్ చేసిన బాలయ్య..? ఆ కామెంట్స్ వెనక అర్థం ఏంటి..!

by AJAY
Published: Last Updated on
Ad

నందమూరి బాలకృష్ణ ఇటీవల వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడిన సంగతి తెలిసిందే. బాలయ్య స్పీచ్ ఇస్తుండగా మధ్యలో అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడటం వివాదాలకు దారితీసింది. బాలయ్య చేసిన కామెంట్ లపై అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు. అంతేకాకుండా అక్కినేని మనవడు నాగచైతన్య ఇప్పటికే బహిరంగ లేఖను సైతం విడుదల చేశారు.

Advertisement

 

అక్కినేని అభిమానులు బాలయ్య క్షమాపణలు చెప్పాలని కోరడంతో తాజాగా బాలయ్య ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. హిందూపూర్ లో బాలయ్య ఓ కార్యక్రమానికి హాజరుకాగా అక్కడ మీడియాకు ఆయన వివరణ ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు తనకు బాబాయి లాంటి వారని చెప్పారు. ఆయన దగ్గర నుండి పొగడ్తలకు దూరంగా ఉండాలనే విషయాన్ని నేర్చుకున్నానని అన్నారు.

Advertisement

అంతేకాకుండా నాగేశ్వరరావు గారికి నేనంటే చాలా ఇష్టం సొంత పిల్లల కంటే ఎక్కువగా నన్ను ప్రేమగా చూసుకునేవారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఆప్యాయంగా పలకరించేవారని… ఎందుకంటే అక్కడ ఆప్యాయత లేదు ఇక్కడ ఉంది అది గుర్తుపెట్టుకోండి అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో బాలకృష్ణ ఇన్ డైరెక్ట్ గా నాగార్జునను టార్గెట్ చేశారని మరోసారి అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇప్పటికే నాగార్జున అక్కినేని పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని… ఇప్పుడు నాగార్జునను టార్గెట్ చేసి అక్కడ ఆప్యాయత లేదు ఇక్కడ దొరుకుతుంది అంటూ మాట్లాడారని మండిపడుతున్నారు. అంతేకాకుండా నాగార్జున ఇప్పటివరకు మౌనంగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడైనా నాకు స్పందించాలని అభిమానులు కోరుతున్నారు. మరి నాగార్జున స్పందిస్తారా లేదా చూడాలి.

Also read : బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. రంగంలోకి దిగిన ఎస్వీఆర్ మనవాళ్లు

Visitors Are Also Reading