Home » జగన్ సర్కార్ పై బాబు గోగినేని సెటైర్లు..? రాష్ట్రంలో ఫ్యాన్ లు ఆగిపోయాయట అంటూ…!

జగన్ సర్కార్ పై బాబు గోగినేని సెటైర్లు..? రాష్ట్రంలో ఫ్యాన్ లు ఆగిపోయాయట అంటూ…!

by AJAY
Ad

ప్రముఖ హేతువాది బాబు గోగినేని పరిచయం అక్కర్లేని పేరు. హేతువాదిగా సామాజిక వేత్తగా బాబు గోగినేని ఎంతో పాపులర్ అయ్యారు. ముఖ్యంగా టీవీ డిబేట్ ల ద్వారా బాబు గోగినేని చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలోనూ ఎక్కువ యాక్టివ్ గా కనిపిస్తూ సామాజిక… రాజకీయ, సినిమా అంశాలపై తనదైన రీతిలో స్పందిస్తుంటారు. నాగబాబు, పవన్ కళ్యాణ్, కత్తి మహేష్, మాధవిలత లాంటి సినిమా వాళ్ళతో సోషల్ మీడియాలో బాబు గోగినేని తో వార్ నడవగా హాట్ టాపిక్ గా మారారు.

Advertisement

ఇక ఆ తరవాత బిగ్ బాస్ సీజన్ 2 లోకి కూడా హేతువాదిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అంతేకాకుండా కౌశల్ ఆర్మీ పేరుతో చేసిన పనులను బాబు గోగినేని బయటపెట్టారు. హౌస్ కౌశల్ కు వ్యతిరేకంగా వెళ్లడం ద్వారానే తక్కువ ఓట్లతో బాబు గోగినేని ఎలిమినేట్ కూడా అయ్యారు.

Advertisement

ఇక ఇటీవల వచ్చిన రాధే శ్యామ్ సినిమాపై రివ్యూ ఇచ్చి వార్తల్లో నిలిచారు. పామిస్ట్రీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పై బాబు గోగినేని విమర్శలు కురిపించారు. అదేవిధంగా ఆర్ఆర్ఆర్ సినిమాపై కూడా బాబు గోగినేని తనదైన రీతిలో రివ్యూ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఏపీలో కరెంటు కోతలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఓ ఆసుపత్రిలో కరెంటు లేక టార్చ్ లైట్ తో వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు.

చాలా ఏరియాలలో కరెంటు కోతల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో పలువురు ఏపీ సర్కార్ పై విమర్శలు కురిపిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో బాబు గోగినేని కూడా చేరారు. బాబు గోగినేని తన సోషల్ మీడియా ద్వారా ఇండైరెక్ట్ గా జగన్ సర్కార్ పై సెటైర్లు వేశారు. “రాష్ట్రంలో ఫ్యాన్లు ఆగిపోయాయి అట…? ఈసారి విసనకర్ర కు ఒక ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది… చీకటి పోతుందేమో” అంటూ సెటైర్లు కురిపించారు. అయితే ఈ సెటైర్లు ఏపీ సర్కార్ పైనే అన్నట్టుగా కింద కామెంట్స్ కనిపిస్తున్నాయి.

 

https://m.facebook.com/story.php?story_fbid=5219147228148025&id=100001583978925&sfnsn=wiwspwa

Visitors Are Also Reading