Home » బాల‌య్య బి.గోపాల్ కాంబో ప‌రువు తీసిన సినిమా ఏదో తెలుసా..? అలా ఎందుకు జ‌రిగిందంటే..?

బాల‌య్య బి.గోపాల్ కాంబో ప‌రువు తీసిన సినిమా ఏదో తెలుసా..? అలా ఎందుకు జ‌రిగిందంటే..?

by AJAY
Ad

బాల‌య్య బి. గోపాల్ కాంబినేష‌న్ కు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉండేది. ఇప్పుడు బాల‌య్య బోయ‌పాటి అంటే ఎలాంటి రెస్పాన్స్ ఉందో అప్ప‌ట్లో బి.గోపాల్ బాల‌య్య సినిమా వ‌స్తుందంటే కూడా అలాంటి రెస్పాన్సే క‌నిపించేది. ఇక ఫ్యాక్ష‌న్ సినిమాల‌కు బి.గోపాల్ కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచారు. అంతే కాకుండా బాల‌య్య మాస్ డైలాగులు చెప్ప‌డంతో పాటూ దుమ్ములేపే ఫైట్ లు చేయ‌డంలో ఆయ‌న్ను మించినోళ్లు లేదు.

ALSO READ :Jio దెబ్బకు దిగివచ్చిన స్టార్…ఇక ఫ్రీగా IPL 2023.. ఎలాగంటే !

Advertisement

ఈ నేప‌థ్యంలోనే వీరి కాంబినేష‌న్ నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించుకుంది. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఐదు సినిమాలు వ‌చ్చాయి. అంతే కాకుండా వాటిలో నాల‌గు సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ లుగా నిలిచాయి. అయితే ఒక్క ప‌ల్నాటి బ్ర‌హ్మ‌నాయుడు సినిమా మాత్రం ఈ కాంబో ప‌రువు తీసింది. అలా ఎందుకు జ‌రిగింది. ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది అనే విష‌యాల‌ను ద‌ర్శ‌కుడు బి.గోపాల్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

Advertisement

ప‌ల్నాటి బ్ర‌హ్మ‌నాయుడు సినిమా విష‌యంలో త‌ప్పు త‌న‌దేన‌ని అన్నారు. ర‌చ‌యిత‌ల త‌ప్పు ఏమీ లేద‌ని చెప్పారు. బాల‌య్య బంగారం అని ద‌ర్శ‌కుడు ఏం చెప్పినా న‌మ్మి చేస్తార‌ని అన్నారు. అయితే ఈ సినిమాలో అతి సీన్ లు ఎక్కువ అయ్యాయని చెప్పారు.

తొడ కొడితే ట్రైన్ వెన‌క్కి వెళ్ల‌డం…విల‌న్ కూర్చున్న కుర్చీ ముందుకు రావ‌డం ఇలా చాలా సీన్ లు ఓవ‌ర్ అయ్యాయ‌ని చెప్పారు. ఆ సీన్ లు బాల‌య్య ఫ్యాన్స్ ను బ‌య‌పెట్టాయ‌ని వ్యాఖ్యానించారు. ఇక బాల‌య్య కూడా ఓ ఇంట‌ర్వ్యూలో ఆ సీన్ లు చేయ‌కుండా ఉండాల్సింద‌ని అన్న సంగ‌తి తెలిసిందే.

ALSO READ:తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్…ఆ పరీక్షల షెడ్యూల్ లో మార్పు. మారిన తేదీలు ఇవే..

Visitors Are Also Reading