Home » APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల..ఇలా చెక్ చేసుకోండి..మెయిన్స్ ఎప్పుడంటే !

APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల..ఇలా చెక్ చేసుకోండి..మెయిన్స్ ఎప్పుడంటే !

by Bunty
Ad

ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది అక్కడి ప్రభుత్వం. వచ్చే ఏడాది ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలోనే, గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. 1:50 నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపిక చేశారు. పరీక్ష నిర్వహించిన కేవలం 20 రోజుల్లోనే తొలిసారి ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

Advertisement

పరీక్షకు హాజరైన వారు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా మొత్తం 111 గ్రూప్-1 పోస్టులకు దాదాపు 87, 718 మంది అభ్యర్థులు గ్రూపు-1 ప్రిలిమినరీ రాత పరీక్ష ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ ‘కీ’ ని కూడా ఇప్పటికే ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆన్సర్ కీ పై జనవరి 11 నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలను ఆన్లైన్ ద్వారా స్వీకరించింది.

Advertisement

అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఫలితాలను విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన విధంగానే మూడు వారాల్లోనే కమిషన్ ఫలితాలు విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ప్రకటించిన 90 రోజుల తర్వాత మెయిన్స్ కూడా నిర్వహించనున్నట్టు ఇప్పటికే ఏపీపీఎస్సీ ప్రకటించింది కూడా.

* APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల కోసం.. ఈ https://psc.ap.gov.in/(S(u2kraldslxbvotn2q5mhpsag))/Default.aspx అధికారిక వెబ్సైట్ చూడండి.

READ ALSO : NTRను కాలితో తన్నిన జమున… భగ్గుమన్న ఫ్యాన్స్, చివరికి ఏమైంది అంటే?

Visitors Are Also Reading