Home » ఇకపై నన్ను ఏదీ బాధించలేదు… సమంత ఎమోషనల్ పోస్ట్

ఇకపై నన్ను ఏదీ బాధించలేదు… సమంత ఎమోషనల్ పోస్ట్

by Bunty
Ad

 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తగ్గేదేలేదంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది సమంత. శాకుంతలం, ఖుషి చిత్రాలను నటిస్తోంది. ఇక ఈ తరుణంలోనే సమంత ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది.

samantha

samantha

ఇప్పటివరకు తనని ఎన్నో విషయాలు బాధించాయని, ఇకపై ఏది తనని బాధ పెట్టదని అన్నారు. అగ్రకథానాయిక సమంత నటిగా తాను తొలి అడుగు వేసి 13 ఏళ్లు అయిన సందర్భంగా అభిమానులను ఉద్దేశిస్తూ ఆమె ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. తనపై ప్రేమను చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. వాళ్ళ ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకున్నారు సమంత.

Advertisement

Advertisement

“నేను ఎంత ఎదిగినా, ఎంత దూరం ప్రయాణించినా, మీరు చూపించే ప్రేమాభిమానాన్ని మర్చిపోలేను. నాపై ఇంతటి అభిమానాన్ని చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే, కొత్త విషయాలను పరిచయం చేస్తున్న ప్రతి రోజుకు కృతజ్ఞతలు. గతంలో ఎన్నో విషయాలు నన్ను బాధించేవి. కానీ, ఇకపై కాదు. కేవలం ప్రేమ, కృతజ్ఞతతో కొనసాగుతున్నా” అని సమంత రాసుకోచ్చారు. కాగా, శాకుంతలం ప్రమోషన్స్ చేస్తూనే, రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

READ ALSO : ‘నీ స్నేహం’ సినిమాలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా ?

Visitors Are Also Reading