కశ్మీర్ ఫైల్స్ సినిమా ఈనెల 11న విడుదలైన సంగతి తెలిసిందే. కాగా కశ్మీర్ ఫైల్స్ సినిమాను భారతీయులందరూ చూడాలని బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఆర్ఆర్ఆర్ సినిమా ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా అమీర్ ఖాన్ హాజరయ్యారు. ఈ సంధర్భంగా కశ్మీర్ ఫైల్స్ సినిమాపై విలేకర్ లు స్పందన అడగ్గా అమీర్ ఖాన్ స్పందించారు.
నిజమే ఈ సినిమా నేను తప్పకుండా చూస్తానని అమీర్ ఖాన్ అన్నారు. ఈ సినిమా కథ చరిత్రలో భాగమని వ్యాఖ్యానించారు. కశ్మీరీ పండిట్ ల విషయంలో జరిగింది విచారకరం అని అమీర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి అంశంతో కూడా ఏ సినిమాను అయినా భారతీయులందరూ చూడాలని చెప్పారు. మానవత్వాన్ని నమ్మే ప్రతిఒక్కరి భావోద్వేగాలను ఈ సినిమా కదిలించిందని చెప్పారు.
Advertisement
Advertisement
సినిమాను తప్పకుండా చూస్తానని…..ఈ చిత్రం మంచి విజయం సాధించినందుకు హ్యాపీగా ఉందని అమీర్ ఖాన్ అన్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని మార్చి 11న విడుదల చేశారు. రాధేశ్యామ్ సినిమాను సైతం ఈ చిత్రం వెనక్కి నెట్టింది. వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 1990లో కశ్మీర్ పండింట్ ల పై జరిగిన దారుణాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా ఈ సినిమాకు భారీ కలెక్షన్ లతో పాటూ బీజేపీ పాలిత ప్రాంతాల్లో సహాయసహకారాలు అందుతున్నాయి.