Home » చిరంజీవి రిక్షావోడు సినిమాలో న‌టించే ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

చిరంజీవి రిక్షావోడు సినిమాలో న‌టించే ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

by AJAY
Ad

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ లుగా రానించిన ముద్దుగుమ్మ‌ల్లో ఆమ‌ని కూడా ఒక‌రు. అప్ప‌ట్లో ఆమ‌ని స్టార్ హీరోల‌కు జోడీగా సినిమాలు చేసింది. ఆమ‌ని ప్ర‌స్తుతం త‌ల్లి మ‌రియు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అంతే కాకుండా అప్పుడ‌ప్పుడు టీవీ కార్య‌క్ర‌మాల్లోనూ సంద‌డి చేస్తోంది. ఇదిలా ఉంటే ఆమ‌ని మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన సినిమాలో న‌టించే అవ‌కాశాన్ని మిస్ చేసుకుంది.

Advertisement

ఆ వివ‌రాలు ఇప్పుడు చూద్దాం..చిరంజీవి హీరోగా న‌టించిన రిక్షావోడు సినిమాను ఆమ‌ని మిస్ చేసుకుంది. కోడి రామ‌కృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా క్రాంతికుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా న‌గ్మా మెయిన్ హీరోయిన్ గా న‌టించ‌గా సౌంద‌ర్య సెకండ్ హీరోయిన్ గా న‌టించింది. కాగా సౌంద‌ర్య సెకండ్ హీరోయిన్ గా న‌టించడ ప్రేక్ష‌కుల‌కు మింగుడుప‌డ‌లేదు.

ALSO READ :మ‌నోజ్ మౌనిక‌ మొద‌ట ఎక్క‌డ క‌లుసుకున్నారో తెలుసా..? వీరి రెండో పెళ్లికి అస‌లు కార‌ణం ఏంటంటే..?

Advertisement

అయితే నిజానికి మొద‌ట ఈ సినిమాలో హీరోయిన్ లు గా సౌంద‌ర్య మ‌రియు ఆమ‌ని ల‌ను సెలక్ట్ చేశారు. అంతే కాకుండా బి గోపాల్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల్సి ఉంది. కానీ బి గోపాల్ ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకోవ‌డంతో ఆయ‌న స్థానంలోకి కోడి రామ‌కృష్ట వ‌చ్చారు. ఇక ద‌ర్శ‌కుడు మార‌డంతో ఆమ‌ని స్థానంలో న‌గ్మాను ఎంపిక చేశారు.

ALSO READ :స్టార్ ప్రొడ్యూస‌ర్ సురేష్ బాబు ఓ సినిమాలో న‌టించాడ‌ని తెలుసా..? ఆ సినిమా ఏదంటే..?

ఈ విష‌యాన్ని ఆమ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. చిరంజీవి త‌న ఫేవ‌రెట్ అని సౌంద‌ర్య త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్ అని అన్నారు. వారితో క‌లిసి న‌టించే ఛాన్స్ మిస్ అయ్యింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆమ‌ని సౌంద‌ర్య‌కు మంచి స్నేహితురాలు అన్న సంగ‌తి తెలిసిందే. చాలా సార్లు ఆమ‌ని సౌంద‌ర్య గురించి చెబుతూ బాధ‌ప‌డింది.

ALSO READ : ఓటీటీలోకి అవతార్ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Visitors Are Also Reading