శ్యామ్సింగరాయ్ హీరో నాని అండ్ టీమ్కి పుష్పరాజ్ అనగా ఐకాన్స్టార్ అల్లుఅర్జున్ క్షమాపణలు చెప్పారు. ఆయన శ్యామ్ సింగరాయ్ సినిమా చూసి వారిని అభినందించడం మరిచిపోయారట. రౌడీబాయ్స్ సినిమా పాటను విడుదల చేయడానికి ముఖ్యతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ తాను శ్యామ్సింగరాయ్ టీమ్ ను అభినందించే అవకాశం దొరకలేదు అని.. మరిచిపోయాను అని చెబుతూ నాని అండ్ టీమ్ చేసిన ప్రయత్నానికి బన్ని అభినందనలు తెలిపారు.
Advertisement
మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగు హీరోలు తమ పంథాను మార్చుకుంటున్నారు. ఒకరి సినిమాను మరొకరు అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలోనో, బహిరంగ వేదికపైనో అభినందనలు మాత్రం చెప్పుకుంటున్నారు. ఇటీవల శ్యామ్సింగరాయ్ సినిమాను ప్రత్యేకంగా చూసి హీరో రామ్ చరణ్ కూడా అభినందించారు. తాజాగా అల్లుఅర్జున్ కూడా అభినందనలు తెలిపారు. కానీ అంతకంటే ముందు క్షమాపణలు చెప్పారు బన్నీ.
Advertisement
తెలుగు సినిమా గెలవాల్సిన సమయం ఇది. కేవలం ఒక్క సినిమానే కాదు.. అన్నీ తెలుగు సినిమాలు విజయం సాధించాలి. కరోనా సెకండ్ వేవ్ తరువాత వచ్చిన తెలుగు సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి. అఖండ పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తరువాత పుష్ప, శ్యామ్సింగరాయ్ సినిమాలు కూడా భారీ విజయాన్నే సాధించాయి. శ్యామ్ సింగరాయ్ టీమ్ను కంగ్రాట్స్ చేసే అవకాశం ఎక్కడా దొరకలేదు. అందుకే ఇప్పుడు చెబుతున్నాను అని పేర్కొన్నారు. నాని పెర్పామెన్స్ చాలా బాగుంది. అదేవిధంగా సాయిపల్లవి కూడా అద్భుతంగా నటించింది. ఎవరైనా సినిమా చూడడం మిస్ అయితే ఓటీటీలో తప్పకుండా చూడండి అని గ్రేట్ అటెంప్ట్ అన్నారు అల్లుఅర్జున్.