నటుడు అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఈయనకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఈయన నటించిన తాజా చిత్రం “తునివు”. ఈ సినిమా విడుదలై దాదాపు ఏడాదికి పైగా అవుతుంది. ఇంతవరకు ఆయన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. ఈయన “విడమయించి” అనే చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించి దాదాపు చాలా రోజులు అవుతుంది.
Advertisement
ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. మొదట ఈ సినిమాకు నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించాల్సి ఉంది. అందుకు సన్నాహాలు కూడా చేసుకున్నారు. ఇక ఆ సినిమా సమయంలో విగ్నేష్ శివన్ ను సినిమా నుంచి తప్పించారు. ఇందులో అజిత్ ప్రమేయం ఉందని కోలీవుడ్ వర్గాల్లో సమాచారం. ఇక ఇందులో వాస్తవం ఏంటనేది తెలియనప్పటికీ మగేల్ తిరుమేని దర్శకత్వం వహించడానికి రెడీ అయ్యాడు. దీంతో ఈ సినిమా ప్రారంభమవుతుందని అంత భావించారు. కానీ మళ్ళీ వాయిదా పడింది. ఈ సినిమాలో అజిత్ సరసన హీరోయిన్గా త్రిష నటించనుందట.
Advertisement
ఇక ఈ సినిమా పలుమార్లు వాయిదా పడడంతో త్రిష వేరే ప్రాజెక్టులకు ఓకే చెప్పిందని సమాచారం. దీంతో ప్రస్తుతం త్రిష షూటింగ్ లలో బిజీగా ఉందట. తన డేట్స్ కుదరకపోవడంతో వేరే హీరోయిన్ ని అనుకున్నారట. కానీ త్రిష మాత్రం ఎలాగైనా ఈ సినిమాలో నటిస్తానని చెబుతోందట. అయితే దీనికి నటుడు అజిత్ అడ్డుపడుతున్నారట. ఆయన దృష్టి అంతా నటి తమన్నా పైనే పడింది. దానికి గల కారణం “జైలర్” సినిమాలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో నటించి చాలా ఫేమస్ అయ్యింది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నాను పెట్టాల్సిందిగా అజిత్ భావిస్తున్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది త్వరలోనే తెలియబోతుంది.
ఇవి కూడా చదవండి
వరల్డ్ కప్ కి పాక్ కండీషన్…Z కేటగిరీ సెక్యూరిటీ కావాలంటూ పట్టు !
ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టిన సినిమాలు…!
వెస్టిండీస్తో ఓటమి.. కన్నీరు పెట్టుకున్న హార్దిక్!