Home » ఆదిపురుష్ సినిమా గురించి ప్రభాస్‌ ముందే చెప్పాడట… కానీ ఆయన వినలేదు..!

ఆదిపురుష్ సినిమా గురించి ప్రభాస్‌ ముందే చెప్పాడట… కానీ ఆయన వినలేదు..!

by Sravya
Ad

ప్రభాస్ అభిమానులు ఆది పురుష సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసారు. సినిమా కోసం నిజంగా ఎంతగానో కలవరించారు కూడా. ఆది పురుష సినిమా కోసం వెయిట్ చేశారు టీజర్ వచ్చిన తర్వాత ఆ సినిమా రావద్దు అని అనుకున్నారు. ఏవేవో టింకరింగ్లు చేసి ట్రైలర్ తీసుకువచ్చిన పరిస్థితి. సినిమాలో కథ గురించి మామూలుగా అయితే మాట్లాడకూడదు ఎందుకంటే అది రామాయణం. అయితే దానిని కూడా ఆయన తన సైడులో చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో మాట్లాడాల్సి వచ్చింది. ఆయన ఆలోచనని చేసిన పని గురించి అడగాల్సి వచ్చింది. ఈ సినిమా గురించి తాజాగా ఓ నటుడు కొన్ని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి.

aadipurush

Advertisement

ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్లో వచ్చిన ఆది పురుష్ మూవీ లో కీలక పాత్ర పోషించిన విందు ధారా సింగ్ ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆది పురుష్ సినిమాని ఓం రౌత్ గందరగోళంగా తీసి ఫ్లాప్ చేశారని అన్నారు. సినిమాలో కొన్ని డైలాగ్లు మార్చమని నటీనటులు కొంతమంది దర్శకులు ఆయన్ని అడిగారట. ఆ డైలాగ్ లు నోరు తిరగటం లేదని చెప్పడానికి ఇబ్బందిగా ఉందని రిలీజ్ అయిన తర్వాత ట్రోల్ చేస్తారని కూడా చెప్పారట. కానీ ఆయన మాత్రం అసలు వినలేదట. ఆది పురుష్ సినిమా మొదలుపెట్టినప్పుడు భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రామాయణం ఆధారంగా తీసిన ఈ సినిమా ఖచ్చితంగా వసూళ్ల సునామిని సృష్టిస్తుందని దర్శకుడు అనుకున్నారు.

Advertisement

అలానే ఫ్యాన్స్ కూడా ముందు అనుకున్నారు. కానీ టీజర్ చూశాక మొత్తం అంతా రివర్స్ అయిపోయింది. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఈ మూవీలో నాసిరకం గ్రాఫిక్స్ చూసి ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేశారు. ప్రభాస్ తప్పేం లేదని అన్నిటికీ దర్శకుడు కారణమని అన్నారు కూడా అదే మాట విందు ధారా సింగ్ చెబుతున్నారు నిజానికి డైలోగ్ల విషయంలో కాదు పాత్రల విషయంలో కూడా పెద్దగా విమర్శలు వచ్చాయి. రావణాసురుని చూపించిన విధానం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని కూడా అన్నారు. కానీ అలా సినిమా ని రిలీజ్ చేసి విపరీతంగా ట్రోల్స్ ని ఎదుర్కొన్నారు అని అన్నారు విందు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading