Home » ఏన్టీఆర్ నా కాళ్లు ప‌ట్టుకుని ఏడ్చారు….హీరో త‌రుణ్ త‌ల్లి కామెంట్స్ వైర‌ల్..?

ఏన్టీఆర్ నా కాళ్లు ప‌ట్టుకుని ఏడ్చారు….హీరో త‌రుణ్ త‌ల్లి కామెంట్స్ వైర‌ల్..?

by AJAY
Ad

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన వారిలో రోజా రమణి కూడా ఒకరు. భక్త ప్రహ్లాద సినిమాలో రోజా రమణి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఈ సినిమాలో అద్భుతమైన తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రోజా రమణి మరికొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇక రోజా రమణి ఆ తర్వాత హీరోయిన్ గా పరిచయమయ్యారు. హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని రోజా రమణి సినిమాలకు పులిస్టాప్ పెట్టారు.

 

రోజా రమణి కెరియర్ లో లవకుశ, అనసూయ, ఆడపడుచు లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. రోజా రమణి హీరో చక్రపాణి తో ఎక్కువ సినిమాల‌లో నటించారు. ఆయనతో స్నేహం కొద్దిరోజుల్లో ప్రేమగా మారింది. దాంతో ఇద్దరూ పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం రోజా రమణి దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. అందులో హీరో తరుణ్ కూడా ఒకరు అన్న సంగతి తెలిసిందే. కాగా తాజా ఇంటర్వ్యూలో రోజా రమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Advertisement

అన్నగారు ఎన్టీఆర్ గురించి పలు విషయాలను రోజార‌మ‌ణి వెల్లడించారు. ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో అభిమానం అని చెప్పారు. ఎన్టీఆర్ తో నటించడం అదృష్టం అని అన్నారు. ఎన్టీఆర్ తో మొదటిసారి తాతమ్మకల సినిమాలో నటించాన‌ని చెప్పారు. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించార‌ని అంతేకాకుండా స్వయంగా నిర్మించార‌ని అన్నారు. ఎన్టీఆర్ తో మొత్తం నాలుగైదు సినిమాలు చేశానని చెప్పారు.

అయితే డ్రైవర్ రాముడు సినిమాలో ఎన్టీఆర్ కు చెల్లి పాత్రలో నటించాన‌ని అన్నారు. ఈ సినిమాలో ఏమని వర్ణించను అనే పాట పాడుతూ సీన్ లో భాగంగా బ్రిడ్జి పై ఆత్మ‌హ* చేసుకునేందుకు వెళుతున్నాన‌ని చెప్పారు. త‌న వెన‌కాల హ‌రికృష్ణ చెల్లెమ్మా అంటూ ప‌రిగెత్తుతూ వ‌స్తున్నార‌ని అన్నారు. ఆ సీన్ లో ఎన్టీఆర్ త‌న‌ కాళ్ల‌పై ప‌డి ఏడుస్తుంటే దర్శకుడు రాఘవేంద్రరావు తమను చూసి ఎమోషనల్ అయ్యి కట్ చెప్ప‌కుండా సీన్ లో లీనమైపోయారని అన్నారు.

ALSO READ :ఈ 3 పేర్లు గ‌ల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మీ జీవితాలు మారిపోతాయాట‌…!

Visitors Are Also Reading