అల్లు అర్జున్ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ పుష్ప. ఈ సినిమాకు టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిమ మందన హీరోయిన్ గా నటించింది. అనసూయ,సునీల్, ఫహద్ ఫాజిల్ తో పాటూ మరికొందరు నటీనటులు కీలక పాత్రలలో నటించారు. ఇక డిసెంబర్ లో విడుదలైన ఈ పాన్ ఇండియా సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందాయి. కేవలం తెలుగులోనే కాకుండా హీందీ మరియు తమిళ ప్రేక్షకులను సైతం సినిమా మెప్పించింది.
Advertisement
ఇక ఈ సినిమాకు పార్ట్ కూడా సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. నిజానికి సుకుమార్ మొదట ఒకే పార్ట్ లో సినిమా మొత్తాన్ని పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ కథ లెంథీగా ఉండటంతో సినిమాను రెండు పార్ట్ లు గా డివైడ్ చేశాడు.ఇక ప్రస్తుతం పార్ట్ 2 చిత్రీకరణ ప్రారంభించడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.
Advertisement
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇంద్రజ రోజా ప్లేస్ లో కొద్ది రోజులు జబర్దస్త్ లో సందడి చేసింది. ఆ తరవాత రోజా రీఎంట్రీ తో ఇతర టీవీ షోలలో కనిపించింది.
ప్రేక్షకులు కూడా ఇంద్రజ రీఎంట్రీ ఇవ్వడంతో కుషీ అయ్యారు. ఇక ఇప్పుడు ఇంద్రజ రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న స్టాండప్ రాహుల్ అనే సినిమా ద్వారా వెండి తెరపై కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. మరోవైపు పుష్ప సినిమాలో కూడా ఇంద్రజ ఛాన్స్ కొట్టేసినట్టు టాక్. ఇక పుష్ప పార్ట్ 1 సూపర్ హిట్ గా నిలవడంతో పార్ట్ 2పై కూడా అంచనాలు పెరిగిన సంగతి తెలిసిందే. దాంతో పార్ట్ 2 తో ఇంద్రజ కూడా పాన్ ఇండియాకు పరిచయం అయ్యే అవకాశం ఉంది.