Home » ఒకప్పుడు వెలుగు వెలిగి వీల్ చైర్ కే పరిమితమైన నటీనటులు వీళ్ళే..!

ఒకప్పుడు వెలుగు వెలిగి వీల్ చైర్ కే పరిమితమైన నటీనటులు వీళ్ళే..!

by AJAY
Ad

జీవితంలో డబ్బు ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ఉంటే చాలు ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు… కావలసినంత డబ్బుని సంపాదించుకోవచ్చు. ఈ విషయం ఎందుకు చెప్పుకుంటున్నామంటే… ఒకప్పుడు ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన సినీ తారలు ప్రస్తుతం వీల్ చైర్ పై బాధపడుతున్నారు. ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం…

chiranjeevi-and-nuthan-prasad-photos

Advertisement

 

టాలీవుడ్ లోని గొప్ప నటుల్లో నూతన్ ప్రసాద్ కూడా ఒకరు. విలన్ గా అద్భుతమైన నటనతో ఆయన ప్రేక్షకులను అలరించారు. అయితే రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్ లో రాజేంద్రప్రసాద్ నూతన్ ప్రసాద్ తాడుతో పైకి లేపిన కార్ లో ఉన్నారు. సడెన్ గా ఆ తాడు తెగిపోవడంతో ఒక్కసారిగా కింద పడింది. దాంతో నూతన్ ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. నడవలేని స్థితికి వెళ్లడంతో చాలా కాలం పాటు వీల్ చైర్ పైనే ఉన్నారు. కొన్ని సినిమాల్లో ఆయన వీల్ చైర్ పైనే నటించారు.

Advertisement

చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి అను అగర్వాల్. హీరోయిన్ గా అను అగర్వాల్ కుర్రాళ్ళ మనసు దోచుకుంది. అంతేకాకుండా అను అగర్వాల్ తీసిన ఆషికి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో ఎంతో క్రేజ్ వచ్చింది. అయితే కారు ప్రమాదంలో అను అగర్వాల్ తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత 20 రోజుల పాటు కోమాలోనే ఉండిపోయింది. తర్వాత కోమా నుండి బయటికి వచ్చినప్పటికీ ఆమె శరీరంలో చాలా చోట్ల రాడ్లు వేశారు. కానీ ప్రస్తుతం అను అగర్వాల్ అన్నింటినీ బరించి తిరిగి ఆరోగ్య వంతురాలు అయ్యింది. వెయిట్ లిఫ్టర్ గా కొనసాగుతోంది.

కమెడియన్ సుధాకర్ ఒకప్పుడు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వాడు. సుధాకర్ కు ఆలీ బ్రహ్మానందం రేంజ్ లో క్రేజ్ ఉండేది. కానీ ఫుల్ బిజీగా ఉన్న సమయంలో సుధాకర్ కు పక్షవాతం వచ్చింది. దాంతో ఆయన వీల్ చైర్ కు పరిమితమయ్యారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చదవండి !

Visitors Are Also Reading