నందమూరి తారకరామారావు మనుమడు నందమూరి తారకరత్న మృతి చెందారు. గత 23 రోజులుగా ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నందమూరి తారకరత్న శివరాత్రి రోజున మృతి చెందారు. ఈ విషయాన్ని నిన్న రాత్రి సమయంలో నారాయణ హృదయాలయ వైద్యుల అధికారులు ప్రకటించారు. తారకరత్న మరణ వార్తను ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే చివరి కోరిక తీరకుండా ఆయన మృతిచెందారు.
Advertisement
సినిమాలలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కానీ తారకరత్న రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే ఆ చివరి కోరిక తీరకుండానే ఆయన మృతిచెందారు. ఇదిలా ఉండగా, తారకరత్న చేతిపై ఉన్న టాటూ ఇప్పుడు మరొకసారి వైరల్ గా మారింది. సింహం ముద్ర తో పాటు బాలయ్య ఆటోగ్రాఫ్ ఉండడం ఈ టాటూ ప్రత్యేకత. బాబాయ్ బాలయ్య పై ఉన్న అభిమానంతో తారకరత్న ఈ టాటూ వేయించుకున్నారు. తారకరత్న కెరియర్ పరంగా సక్సెస్ కావాలని కష్టపడ్డ వారిలో బాలయ్య కూడా ఒకరు.
Advertisement
అయితే తారక్ నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ అవ్వగా, మరికొన్ని సినిమాలు విజయాన్ని అందుకోలేదు. తారకరత్న మరణ వార్త విన్నప్పటి నుంచి బాలయ్యను ఓదార్చడం ఎవరివల్ల కావడం లేదని తెలుస్తోంది. అంత బాధలో ఉన్నప్పటికీ కూడా తారకరత్న భార్య, పిల్లలకు ఆయనే ధైర్యం చెబుతున్నారని సమాచారం. వరుసకు బాబాయ్ అయినా సరే తారకరత్నను తండ్రిలా చూసుకున్నారు. అందుకే తనకి కొడుకు కంటే ఎక్కువైనా తారకరత్న మరణించడంతో బాలయ్య బాబు శోకసంద్రంలో మునిగిపోయారు.