హీరో సుహాస్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. యూట్యూబ్ వీడియోలతో తన కెరీర్ ని ప్రారంభించి కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ పై హీరోగా అవకాశాన్ని అందుకునే స్థాయి వరకు ఎదిగాడు. ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో తన నటనకుగాను జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. కలర్ ఫోటో సినిమాతో సుహాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
తన చేతిలో ఎప్పటికప్పుడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. చాయ్ బిస్కెట్ లో కమెడియన్ గా వీడియోలు చేసుకునే సుహాస్ కెరీర్ లో ఎన్నో విజయాలను సాధిస్తున్నారు. ఒక్కో షార్ట్ ఫిలింకి 3వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయి నుంచి ప్రస్తుతం ఒక్కో సినిమాకు 3 కోట్ల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నాడు.
Advertisement
Advertisement
సుహాస్ క్రేజ్ చూసి డైరెక్టర్లు సైతం తాను అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇక ప్రస్తుతం సుహాస్ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు దుష్యంత్ కాటికినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ సంస్థ రిలీజ్ చేయనుంది. ఇక రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ టీజర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ డూపర్ రెస్పాన్స్ ను రాబట్టుకోవడమే కాకుండా ఈ సినిమాపై మంచి అంచనాలు పెరిగేలా చేసింది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!