Home » సౌందర్య మరణం తరువాత భర్త పరిస్థితి అంత దారుణంగా ఉందా ? ఎలా ఉన్నారంటే ?

సౌందర్య మరణం తరువాత భర్త పరిస్థితి అంత దారుణంగా ఉందా ? ఎలా ఉన్నారంటే ?

by AJAY
Ad

టాలీవుడ్ ప్రేక్షకులు అందాల తార సౌందర్య ను ఎప్పటికీ మర్చిపోలేరు. సౌందర్య ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అంతేకాకుండా బోల్డ్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం నటనను మాత్రమే నమ్ముకున్నారు. ఎన్నో సినిమాలలో స్టార్ హీరోల పక్కన చేసిన సౌందర్య ఏ సినిమాలో కూడా ఎక్స్ పోజింగ్ చేయలేదు. రొమాంటిక్ సీన్లకు సైతం సౌందర్య దూరంగా ఉన్నారు. ఈనేపథ్యంలో ఫ్యామిలీ హీరోయిన్ గా లేడీస్ సౌందర్యను చాలా ఇష్టపడేవారు.

Advertisement

స్టార్ హీరోలు అయిన వెంకటేష్, చిరంజీవి లతో కలిసి సౌందర్య సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. వీరి పెయిర్ ను హిట్ పెయిర్ అని కూడా అనేవారు. అయితే సౌందర్య చిన్నవయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే సౌందర్య బిజెపి పార్టీలో చేరారు. పార్టీ ప్రచారం కోసం హెలికాప్టర్ లో వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు.

Advertisement

ఈ ప్రమాదంలో సౌందర్య సోదరుడు అమర్ కూడా మరణించిన సంగతి తెలిసిందే. ఇక చనిపోయేముందు సౌందర్య బాలకృష్ణ దర్శకత్వం లో నర్తనశాల అనే సినిమాను ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే సౌందర్య మరణించారు. దాంతో ఈ సినిమాను అక్కడికే ఆపేశారు. ఇటీవలే బాలకృష్ణ ఈ సినిమాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సౌందర్య మరణించే కొద్దిరోజుల ముందే తన మేనమామ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రఘు ను 2003లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తరవాత ఏడాది పూర్తి కాకుండానే సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో రఘు డిప్రెషన్ లోకి వెళ్లి పోయారు.

heroine-soundarya

సౌందర్య మరణించిన తర్వాత చాలా కాలానికి రఘు డిప్రెషన్ నుండి బయటపడ్డారు. అంతేకాకుండా 2003లో సౌందర్య మరణిస్తే రఘు 2014 లో మరో మహిళను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం రఘు తన భార్యతో కలిసి గోవాలో ఉంటున్నట్టు సమాచారం. అంతేకాకుండా రఘు సౌందర్య కలిసి ఉండాలని కట్టుకున్న ఇల్లు కూడా ప్రస్తుతం పాడుబడ్డ బంగళా మాదిరిగా తయారైందని సమాచారం.

Visitors Are Also Reading