Home » ఫస్ట్ సినిమాతోనే అందంతో కట్టిపడేసిన తలుకులతార మందాకిని ఎవరో తెలుసా…?

ఫస్ట్ సినిమాతోనే అందంతో కట్టిపడేసిన తలుకులతార మందాకిని ఎవరో తెలుసా…?

by AJAY
Ad

కొంతమంది హీరోయిన్లను చూస్తే భువి నుండి దివికి దిగివచ్చారా అన్నంత అందంగా కనిపిస్తారు. అలా అనిపించే హీరోయిన్లలో మందాకిని కూడా ఒకరు. మందాకిని అసలు పేరు యాసిన్ జోసెఫ్ కాగా ఆమె తల్లిదండ్రులు ఆంగ్లో-ఇండియన్లు. ఇక ఈ ముద్దుగుమ్మను ప్రముఖ నటుడు, దర్శకుడు రాజ్ కపూర్ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. రాజ్ కపూర్ తన కుమారుడు రాజీవ్ కపూర్ హీరోగా 1985లో రామ్ తేరీ గంగా మైలీ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మందాకిని నటించింది.

Advertisement

కథ డిమాండ్ చేయడం తో మందాకిని సినిమాలో అర్థ నగ్నంగా కనిపించింది. అలా మందాకిని కనిపించిన పాట కోసమే ఎంతోమంది ఈ సినిమాకు వచ్చారు. అంటే ఒక్క సినిమాతోనే ఆమె ఎంతమందిని తనవైపు తిప్పుకుందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మందాకిని మిథున్ చక్రవర్తి హీరోగా డాన్స్ డాన్స్, గోవిందా తో ప్యార్ కర్కే దేకో అనే చిత్రాలలో నటించింది. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అదేసమయంలో మందాకిని సౌత్ ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా టాలీవుడ్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా సింహాసనం సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Advertisement

ఈ చిత్రంలో వారేవా నీ యవ్వనం అనే పాటలో కనిపించి మందాకిిని తెలుగువారిని సైతం తన అందం తో కట్టిపడేసింది. అదే విధంగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భార్గవ రాముడు సినిమాలో కూడా మందాకిని హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఇక 1990 సంవత్సరంలో మందాకినీ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత కూడా 1996 లో జోర్ధార్ సినిమాలో నటించింది. కానీ ఆ తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పి కుటుంబం తో హ్యాపీ గా ఉంది.

Visitors Are Also Reading