మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్ లోకి వెళ్లక ముందు నటించిన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. పాలిటిక్స్ లోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తున్నారనుకున్నారో అప్పటి నుంచి సినిమాల పై అంతగా ఆసక్తి పెట్టలేదు. అందుకే చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
Advertisement
ఇక రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత రీమిక్ గా వినాయక్ వినాయక్ దర్శకత్వం లో తెరకెక్కిన ఖైదీ నెం.150 మూవీ నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి నటించిన సినిమాలలో వాల్తేరు వీరయ్య మినహా మరే సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
కొన్ని సినిమాలు నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగల్చడం గమనార్హం.అయితే రీ ఎంట్రీలో చిరంజీవి చేస్తున్న కొన్ని తప్పుల వల్లే సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రీఎంట్రీలో చిరంజీవి రీమేక్ సినిమాలలో ఎక్కువగా నటించడం ఆయనకు మైనస్ అవుతోంది. కరోనా తర్వాత రిలీజ్ అయిన రీమేక్ సినిమాలేవి థియేటర్లలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించలేదు. ఇలాంటి సమయంలో చిరంజీవి రీమిక్ లకు దూరంగా ఉంటే మంచిది.దర్శకుల ఎంపికలో కూడా చిరంజీవి పొరపాట్లు చేస్తున్నారు. రొటీన్ కథలకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మైనస్ అవుతుంది. ఈ జనరేషన్ ప్రేక్షకులకు నచ్చే కథలను ఎంపిక చేసుకోవడంలో చిరంజీవి తప్పటడుగులు వేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
వయసుకు తగిన పాత్రలను చిరంజీవి ఎంచుకుంటే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి సినిమాల ఎంపికలో ఒకటికి రెండుసార్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటే కమర్షియల్ గా వరుస విజయాలు సొంతమయ్యి అవకాశాలు అయితే ఉంటాయి.చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా సక్సెస్ సాధించడంలో మెగాస్టార్ జాగ్రత్తగా అడవులు వేయాల్సి ఉంది. చిరంజీవిని అభిమానించే వాళ్ళ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. చిరంజీవి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మామూలుగా లేదనే సంగతి తెలిసిందే. సరైన కథలను ఎంచుకుంటే చిరంజీవి సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని చెప్పవచ్చు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు
హీరోయిన్ శ్రీలీల సినిమాలకు గుడ్ బై చెప్పనుందా..? అందుకోసమేనా ?
ఆ స్టార్ హీరోతో నిత్యామీనన్ డేటింగ్…రహస్యంగా ఇక ఆ పని కూడా…?