Home » సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలు పెట్టిందనే విషయం మీకు తెలుసా ? 

సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలు పెట్టిందనే విషయం మీకు తెలుసా ? 

by Anji
Ad

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు సౌందర్య,రమ్యకృష్ణ, విజయశాంతి, రోజా, మీనా వంటి హీరోయిన్లు ఓ ఊపు ఊపేశారు. ఈ హీరోయిన్ లందరిలో కూడా సౌందర్య కాస్త ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ముఖ్యంగా ఆమె ఎక్కువగా ఫ్యామిలీకి చెందిన సినిమాలనే ఎక్కువగా తీసింది.  దీంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సౌందర్య, రమ్యకృష్ణ కలిసి సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీలో నటించారు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో సౌందర్య ముఖంపై రమ్యకృష్ణష్ణ కాలుతో తన్నింది. ఆ విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

తమిళంలో పడయప్ప మూవీని తెలుగులోకి నరసింహాగా డబ్బింగ్ చేశారు. అప్పట్లో ఈ మూవీ తమిళం కంటే ఎక్కువగా తెలుగులోనే భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలను తాజాగా రమ్యకృష్ణ ఓ చిట్ చాట్ లో వెల్లడించింది. నరసింహా సినిమాలో రమ్యకృష్ణ నెగిటివ్ రోల్ ఉన్న పాత్రలో నటించింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఎలాగైనా రజినీకాంత్ ను వివాహం చేసుకోవాలని భావిస్తుంటుంది. కానీ రజినీకాంత్ సౌందర్యని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. దీంతో సౌందర్య పై రివేంజ్ తీసుకోవాలనుకుంటుంది రమ్యకృష్ణ.

Advertisement

అయితే రమ్యకృష్ణ ఇంట్లో పని చేస్తుంటుంది సౌందర్య. ఓ సందర్భంలో సౌందర్య పని చేస్తుండగా.. రమ్యకృష్ణ వచ్చి సౌందర్య ముఖంపై కాలు పెట్టి తన్నుతుంది. అంతేకాదు.. ఇదే సమయంలో నా కాలికింద ఉండే దానివి అంటూ ఓ డైలాగ్ కూడా చెబుతుంది. అయితే ఈ సన్నివేశం చేసేందుకు తొలుత రమ్యకృష్ణ ఒప్పుకోలేదట. కానీ ఈ సినిమాలో ఈ సీన్ హైలెట్ అని దర్శకుడు, సౌందర్య చెప్పడంతో చివరికీ చేయడానికి ఒప్పుకుందట రమ్యకృష్ణ. అంతేకాదు.. ఈ సీన్ ముగిసిన తరువాత రమ్యకృష్ణ చాలా బాధపడి ఏడ్చినట్టు వెల్లడించింది. ప్రస్తుతం రమ్యకృష్ణ ఈ విషయాలను బయటపెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ముఖ్యమైన వార్తలు : 

నాగ చైతన్య కి సమంత విడాకులు ఇవ్వడానికి కారణం తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!

రీ రిలీజ్ కానున్న బాలయ్య ఫ్లాప్ సినిమాలు.. నెటిజన్స్ ఏమంటున్నారంటే ?

ధనుష్ సినిమా కోసం రష్మిక రెమ్యునరేషన్ తగ్గించడానికి కారణం ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading