Home » తెలుగు సినిమాల పై సాయిపల్లవి సంచలన నిర్ణయం.. అందుకోసమేనా ?

తెలుగు సినిమాల పై సాయిపల్లవి సంచలన నిర్ణయం.. అందుకోసమేనా ?

by Anji
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో సక్సెస్ అయ్యే వారు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. సక్సెస్ సాధించే హీరోయిన్ లలో సాయిపల్లవి ఒకరు. ప్రస్తుతం ఉన్నటువంటి హీరోయిన్లందరిలో సాయి పల్లవి యాక్టింగ్ కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది. సినిమాల్లో అయినా సరే.. బయట అయినా సరే చాలా లేడీ పిల్లలా చలాకీగా ఉంటుంది. అలాంటి సాయిపల్లవి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫిదా మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. అయినప్పటికీ వాటన్నింటినీ రిజెక్ట్ చేసి కేవలం విరాటపర్వం మూవీ చేసింది. 

Advertisement

కానీ ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. యావరేజ్ గా నడిచింది. ఇక అప్పటి నుంచి సాయిపల్లవి కొత్త సినిమాలకు కూడా సంతకం చేయలేదు. గత ఏడాది కాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమె నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఆమెను ఇటీవలే తెలుగు సినిమా ఇండస్ట్రీలోని దర్శక, నిర్మాతల నుంచి ఆఫర్స్ ఇచ్చినా కానీ ఒప్పుకోవడం లేదట. ఇదే విషయంపై తాజాగా ఓ నిర్మాత సాయి పల్లవిని డేట్స్ కోసం అడగ్గా ఇక తాను తెలుగు సినిమాలను అస్సలు చేయనని ముఖం మీదనే చెప్పేసిందట. 

Advertisement

పారితోషికం ఎంత ఇస్తానన్నా.. కానీ నో అని చెబుతుందట సాయిపల్లవి. అసలు సాయి పల్లవికి తెలుగు సినిమా ఇండస్ట్రీ పై ఇంత మొహం కొట్టింది ఎందుకో అంటూ ఆమె అభిమానులు రకరకాల సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  తెలుగులో ఇప్పటి వరకు సాయిపల్లవి ఫిదా, కణం, పడిపడి లేచే మనసు, ఎన్.జీ.కే., లవ్ స్టోరీ, గార్గి,  విరాట పర్వం వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సాయిపల్లవి తెలుగు సినిమాల్లో నటించడం ఇష్టం లేకపోవడం వల్లనే నటించడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈమె ముందు ముందు తెలుగు సినిమాల్లో నటిస్తుందో లేదో మరీ వేచి చూడాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఉదయ్ కిరణ్ భార్య విషిత ఇప్పుడు ఎలాంటి పనులు చేస్తుందో తెలుసా ?

పవన్ కళ్యాణ్ ‘BRO’ మూవీకి ఫస్ట్ అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading