Home » ఈసారి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోయే స్టార్ కపుల్ ఎవరో తెలుసా…?

ఈసారి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోయే స్టార్ కపుల్ ఎవరో తెలుసా…?

by Mounika
Ad

 ఇప్పటికే ఆరు సీజన్లో దిగ్విజయంగా పూర్తి చేసుకున్న  బిగ్ బాస్ రియాల్టీ షో  ఏడో సీజన్ లో అడుగుపెట్టడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇటీవలే  బిగ్ బాస్ నిర్వాహకులు దీనికి సంబంధించిన ప్రోమోన్ కూడా విడుదల చేశారు. బిగ్బాస్ 7 ఎప్పుడు ఎప్పుడు ప్రసారం కాబోతుందా అంటూ  బుల్లితెర ప్రేక్షకులు కూడా  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సారి బిగ్ బాస్ గేమ్ షో మరింత ఆసక్తికరంగా కొనసాగపోతుందని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక సామాజిక మాధ్యమాలలో బిగ్ బాస్ హౌస్ లోకి రాబోయే సెలబ్రిటీస్ వీళ్లే అంటూ  చాలా మంది పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

 బిగ్ బాస్ షోలో గత కొన్ని సీజన్లుగా వివాహమైన సెలబ్రిటీ జంటలను ప్రవేశపెడుతూ షో కి మరింత క్రేజ్ పెంచారు.  ఈసారి బిగ్ బాస్ సీజన్ 7లో హౌస్ లోకి ఓ స్టార్ కపుల్ కూడా పాల్గొంటారని సమాచారం అందుతుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 7లో  జంట వీరే అంటూ అమర్‌దీప్-తేజస్విని పేర్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. నెటిజన్స్ సైతం కచ్చితంగా  ఈ జంట బిగ్ బాస్ లో పాల్గొనడం ఖాయం అంటూ  అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ జంట సీరియల్స్ ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను అలరించి మెప్పించారు.

Advertisement

రామ క్యారెక్టర్ లో  జానకి కలగనలేదు అనే సీరియల్తో అమర్ దీప్ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.  మరోవైపు తేజస్వి గౌడ కూడా  ‘కేరాఫ్ అనసూయ సీరియల్తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తేజస్విని కన్నడ టీవీ షోలలో కూడా నటించిడంతో అక్కడ కూడా ఆమెకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. గత ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకున్న వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మరి ఈ జంట బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా.. లేదా..? అనేది అఫీషియల్ లిస్ట్ వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

Sai Dharam Tej: సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్న సాయి ధరమ్ తేజ్.. కారణం ఏంటంటే?

ఈ సీరియల్ హీరోల రెమ్యునరేషన్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోడం పక్కా..!

Tanikella bharani: ఆ వయసులో 5 , 6 గురు హీరోయిన్లతో తనికెళ్ళ భరణి ఎఫైర్..? ఆ టైం లో ఏమి జరిగింది అంటే?

 

Visitors Are Also Reading