తల్లిదండ్రులకు ఉండే మంచి లక్షణాలే పిల్లలకు వస్తాయని నిరూపించింది మహేష్ బాబు, నమ్రత శిరోద్కరల గారాల పట్టి సితార. మహేష్ బాబు యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని అధిక మొత్తంలో ఛారిటీల కోసం వినియోగిస్తారు. ఆయనకు యాడ్స్ రూపంలో వచ్చిన రెమ్యునరేషన్ మొత్తాన్ని చిన్న పిల్లల గుండె ఆపరేషన్స్కి ఖర్చు చేస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సితార కూడా తండ్రి మహేష్ బాబు బాటల్లోనే తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.
ఇటీవల సితార పీఎంజే అనే జ్యువెలరీ బ్రాండ్కు అంబాసిడర్గా వ్యవహరించింది. సితార నటించిన ఈ జ్యువెలరీ యాడ్కు సంబంధించిన ఫొటోలను ఏకంగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్బోర్డ్ పై ప్రకటించడం జరిగాయి. దీనితో సితార పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. జువెలరీ యాడ్స్ లో సితార ఫొటోస్ ని చూసి అచ్చు దేవకన్యలా ఉంది అంటూ తెలుగు ప్రేక్షకుల మురిసిపోయారు. ఇక ఈ ప్రకటనలో నటించేందుకు గానూ సితార కోటి రూపాయలు వరకు రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తుంది.
PMJ జ్యువెల్స్ సితార సిగ్నేచర్ కలెక్షన్స్, లుక్బుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తన తల్లి నమ్రతా శిరోద్కర్తో కలిసి సితార పాల్గొనడం జరిగింది. ఇటీవల జరిగిన ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న సితార తన ఫస్ట్ రెమ్యునరేషన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ ఇంటర్వ్యూలో ఈ యాడ్ ద్వారా వచ్చిన మొదటి పారితోషికాన్ని ఎవరికిచ్చారు..? మీ అమ్మ గారికా లేక మీ నాన్న గారికిచ్చారా? లేదా మీరే తీసేసుకున్నారా? అని పాత్రికేయుడు ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా.. సితార తన మొదటి పారితోషికాన్ని ఛారిటీకి ఇచ్చానని సమాధానం ఇచ్చింది. దీంతో ఆమెపై నెటిజన్స్ సైతం అందంలోనే కాదు.. మంచి చేయడంలో కూడా తండ్రికి తగ్గ కూతురివి అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
Like Father – Like Daughter ❤️
I Give My First Remuneration To Charity – Sitara❤️🙏 pic.twitter.com/1BIu3pSLW1
— Naveen MB Vizag (@NaveenMBVizag) July 15, 2023
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Prabhas Project K: ప్రభాస్ సినిమా కు మరో టైటిల్.. “K” అంటే అసలు అర్ధం ఇదా!