సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తరువాత సెలబ్రిటీలు వారి అభిమానులకు మరింత చేరువయ్యే అవకాశం లభించినది. ట్విటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వంటి ప్రధాన సామాజిక మాద్యమాల్లో ఎప్పటికప్పుడూ తమకు సంబందించిన అప్డేట్ పంచుకోవడం ఇప్పుడు సులువు అయింది. తద్వారా ఫ్యాన్స్ను అలరించడంలో పాటు అదనపు ఆదాయాన్ని అర్థించే మార్గం కూడా దొరికింది. యాడ్స్ ప్రమోషన్స్తో చేతినిండా సంపాదిస్తున్నారు.
Advertisement
రోజు రోజుకూ ఫాలోవర్లను పెంచుకుంటూ.. ఒక్కోపోస్టుకు కోట్లాది రూపాయలు వసూలు చేసి ప్రముఖులు చాలా మదే ఉన్నారు. ముఖ్యంగా ఫొటో, వీడియో బ్లాగింగ్ ఫ్లాట్పామ్ ఇన్స్టాగ్రామ్ వారిపై కాసుల వర్షం కురిపిస్తోంది. క్రీడా విభాగానికి సంబంధించి ఇన్స్టా పోస్టులతో అత్యధికంగా సంపాదించిన గత ఏడాది టాప్-20లో ఉన్న సెలబ్రిటీలో చోటు దక్కింది. కోహ్లి ఒక్కో పోస్ట్కు సుమారు 680,000 డాలర్లు అందుకుంటున్నాడు.
Advertisement
ఇప్పటివరకు తన ఆట, యాడ్స్.. ప్రమోషన్లు భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మతో ఉన్న ఫొటోలు షేర్ చేసిన కోహ్లి తన గారాల పట్టి వామిక ఫొటోను మాత్రం రివీల్ చేయలేదు. జనవరి 11 వామిక తొలిపుట్టిన రోజు తరుణంలో ఇప్పటికైనా చిన్నారి రూపాన్ని తమకు చూపిస్తాడు అని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ గారాల పట్టి వామిక ఫోటోలను కోట్లలో లైకులు రావడం ఖాయమని, ఫాలోవర్లు కూడా భారీగా పెరుగుతారంటూ కామెంట్లు చేస్తూన్నారు.
కోహ్లీకి ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటివరకు 177 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక చివరిసారిగా తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసాడు కోహ్లి. ప్రస్తుతం అతడు దక్షిణాఫ్రికా టూర్లో ఉన్నాడు. గాయం కారణంగా రెండో టెస్ట్కు దూరమైన కోహ్లి.. మూడవ మ్యాచ్కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఒక్కో ఇన్ స్టా పోస్ట్తో ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డ్ 1,604,000 అమెరికన్ డాలర్లు సంపాదిస్తూ ప్రపంచంలోనే నెంబర్వన్గా ఉన్నాడు. అతనికి 387 ఫాలోవర్లున్నారు. ఫాలోవర్ల ఆధారంగా సెలబ్రిటీలు చేసే పోస్టుకు లభించే ఆదాయంలో వ్యత్యాసాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే.