Home » ప్ర‌భాస్ ముందు.. ఆ త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటున్న థ‌మ‌న్..!

ప్ర‌భాస్ ముందు.. ఆ త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటున్న థ‌మ‌న్..!

by Anji
Ad

ప్ర‌స్తుతం టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఉన్న ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుల్లో ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ పేరు ముందే ఉంటుంది. దాదాపు ఆయ‌న అంద‌రూ స్టార్ హీరోల‌తో సినిమాలు చేసారు.ఇప్పుడు అన్నింటికీ సంగీతం అందిస్తున్న‌ది ఎక్కువ థ‌మ‌నే కావ‌డం విశేషం. అయితే ప్ర‌భాస్ హీరోగా పూజా హెగ్దే హీరోయిన్‌గా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న రాధేశ్యామ్ సినిమాకు ఆఖ‌రి నిమిషంలో నేప‌థ్య సంగీతం అందించ‌డానికి రంగంలోకి దిగాడు థ‌మ‌న్‌.

Prabhas Fans: ఆ విషయంలో కంగారు పడుతున్న ప్రభాస్ అభిమానులు | Fans Tension  about Prabhas Radhe Shyam Movie Visual Effects of Ship Scene | Tollywood  News

Advertisement

Advertisement

అయితే భీమ్లానాయ‌క్ సినిమాకు సంగీతం సంక్రాంతికి ఇవ్వాల‌ని ప్లాన్ చేస్తున్నాడు థ‌మ‌న్‌. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం.. రాధేశ్యామ్ సినిమా వ‌ల్ల భీమ్లానాయ‌క్ సినిమాకు ఇవ్వాల్సిన సంగీత ఆల‌స్యం అవుతుంద‌ట‌. ప్ర‌స్తుతం థ‌మన్ రాధేశ్యామ్ రీ రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడ‌ని స‌మాచారం. దీంతో కొన్ని రోజుల పాటు భీమ్లానాయ‌క్‌ను ప‌క్క‌న పెట్టాల్సి వ‌చ్చిన‌ది.

 

Bheemla Nayak to back in Sankranthi race

పాచ్ వ‌ర్క్ మొత్తం పూర్త‌యిన‌ప్ప‌టికీ సినిమా సంక్రాంతికి రెడీ అయ్యే అవ‌కాశం లేదు. అనుకున్న స‌మయానికి భీమ్లానాయ‌క్ సినిమాను ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. మ‌రొక‌వైపు రాధేశ్యామ్ సినిమా జ‌న‌వ‌రి 14 విడుద‌లవ్వాలి. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే.. ఆర్ఆర్ఆర్ సినిమా మాదిరిగానే రాధేశ్యామ్ కూడా వాయిదా ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గానే క‌నిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading