Home » మీ పోస్ట్ చూసి మా అన్నయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు..రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు..!

మీ పోస్ట్ చూసి మా అన్నయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు..రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు..!

by Anji
Ad

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడంతో పాటు ఆ సినిమాలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు రావడం తెలిసిందే. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రశంసిస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే దర్శకుడు రాజమౌళి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా అమెరికా దిగ్గజ సంగీత కారుడు రిచర్డ్ కార్పెంటర్ ఇచ్చిన సర్ ప్రైజ్ చూసి తన సోదరుడు కీరవాణి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారని రాజమౌళి తెలిపారు. 

Also Read :  షారూఖ్ ఖాన్ పఠాన్ మూవీ సాధించిన రికార్డు గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Advertisement

ఆస్కార్ క్యాంపెయిన్ మొత్తం చాలా ప్రశాంతంగా ఉన్న కీరవాణి రిచర్డ్ సందేశం చూసిన వెంటనే ఉద్వేగానికి లోనైనట్టు చెప్పారు. “ సార్.. ఆస్కార్ ప్రచారంలో మొత్తం అన్నయ్య ఎలాంటి భావోద్వేగాన్ని ప్రదర్శించలేదు. ఆస్కార్ గెలుపొందడానికి ముందు, ఆ తరువాత కూడా ఆయన ఏవిధమైన ఉద్వేగాన్ని బయటపెట్టలేదు. కానీ మీరు చేసిన పోస్టు చూసిన తరువాత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. మా కుటుంబానికి ఇది ఒక మధురానుభూతి” అని వెల్లడించారు రాజమౌళి. 

Advertisement

Also Read :  జక్కన్న అవార్డుపై విమర్శలు చేసే వారికి చెంపపెట్టు లాంటి న్యూస్..!!

 

ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు తరువాత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ.. “నేను రిచర్డ్ కార్పెంటర్ సాంగ్స్ వింటూ పెరిగాను” అని చెప్పారు. ఇక ఆ తరువాత రిచర్డ్ ఫేమస్ సాంగ్ టాప్ ఆఫ్ ది వరల్డ్ ని తనదైన శైలిలో మార్చి స్టేజ్ పై కీరవాణి పాడి వినిపించారు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన రిచర్డ్.. కీరవాణి, చంద్రబోస్ కి అభినందనలు తెలుపుతూ ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు. తన కుమార్తెలతో కలిసి ఆయన టాప్ ఆఫ్ ది వరల్డ్ పాటను ఆలపిస్తూ.. ఆర్ఆర్ఆర్ టీమ్ కి కంగ్రాట్స్ చెప్పారు. రిచర్డ్ చేసిన ఆ పోస్ట్ పై కీరవాణి సంతోషం వ్యక్తం చేశారు. కార్పెంటర్ పోస్ట్ చూసి తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. 

Also Read :  “మగధీర”కు మొదట అనుకున్న స్టార్ ఎవరో తెలుసా…?

Visitors Are Also Reading