Home » అప్పటి ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తండ్రిని గుర్తు చేసుకుంటూ..!

అప్పటి ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తండ్రిని గుర్తు చేసుకుంటూ..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారు ఉండరు. ఆయన ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ మెగాస్టార్ గా ఎదిగారు. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి ఆదరణ పొందాయి. 

Advertisement

ఈ నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తండ్రి గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి వెంకట్ రావు వర్ధంతి సందర్భంగా ఇవాళ ఆయనను స్మరించుకున్నారు. తల్లి అంజనాదేవి, సోదరుడు నాగబాబు, సోదరీమణులతో కలిసి ఆయనకు నివాళులర్పించారు చిరంజీవి. ఈ ఫోటోతో పాటు తండ్రితో కలిసి దిగిన పాత ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముఖ్యంగా “మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో  పెంచి, జీవితపు ఒడిదుడుకుల పట్ల అవగాహన పంచి, మా కృషి లో ఎప్పుడూ తోడుగా ఉండి, మా విజయాలకు బాటనేర్పరిచిన మా తండ్రి వెంకట్రావు గారిని ఆయన సంవత్సరీకం సందర్బంగా స్మరించుకుంటూ” అంటూ భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు చిరంజీవి.  

Advertisement

Also Read :  పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లులో ఔరంగజేబుగా నటించేది ఎవరో తెలుసా ?

Image

మెగాస్టార్ చిరంజీవి తన తండ్రితో కలిసి ఫ్యామిలీ మొత్తం ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటోలు చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, తండ్రి వెంకట్రావు, తల్లి అంజనాదేవి, తమ్ముల్లు నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. మెగా ఫ్యామిలీకి చెందిన చాలా రేర్ ఫోటోను చూసి అభిమానులు సంబురపడుతున్నారు. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. 

Also Read :  అల్లు అర్జున్ తన భార్యని ఏమని పిలుస్తాడో తెలుసా ? సీక్రెట్ బయటపెట్టిన స్నేహారెడ్డి..!

Visitors Are Also Reading