Home » ప్రాణం లాంటి త్రివిక్ర‌మ్ రావు ఎన్టీఆర్ కు ఎందుకు దూరం అయ్యారు..? ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టింది ఎవ‌రు..?

ప్రాణం లాంటి త్రివిక్ర‌మ్ రావు ఎన్టీఆర్ కు ఎందుకు దూరం అయ్యారు..? ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టింది ఎవ‌రు..?

by AJAY
Ad

నంద‌మూరి ఎన్టీరామారావు సినిమా ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోగా రానించ‌డంతో పాటూ రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజ‌కీయాల్లో తిరుగులేని వ్య‌క్తిగా ఎదిగారు. ఎన్నో ప‌థ‌కాల ద్వారా పేద ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించి చ‌రిత్ర‌లో నిలిచిపోయారు. ఎన్టీఆర్ త‌న కుటుంబీకుల తోనూ క‌లిసి మెలిసి ఉండేవారు. సాధార‌ణంగా అన్న‌ద‌మ్ములు అంటే ఆస్తుల కోసం గొడ‌వ‌లు ప‌డ‌టం లాంటివే చూస్తుంటాం. కానీ ఎన్టీఆర్ త‌న సోద‌రుడు త్రివిక్ర‌మ్ రావుల అనుబంధం చూస్తే రామ‌ల‌క్ష‌మ‌ణులను చూసిన‌ట్టుగానే ఉంటుంది.

Also Read:   ఎన్టీఆర్ అట్ట‌ర్ ఫ్లాప్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న పునీత్ రాజ్ కుమార్..! ఆ సినిమా ఏదంటే..?

Advertisement

ఎన్టీఆర్ స‌న్నిహితులు కూడా చాలా మంది త్రివిక్ర‌మ్ రావు ఎన్టీఆర్ ల అనుబంధాన్ని గురించి గొప్ప‌గా చెబుతుంటారు. ఎన్టీఆర్ హీరోగా సీఎంగా చాలా మందికి తెలుసు. కానీ త్రివిక్ర‌మ్ రావు గురించి పెద్ద‌గా తెలియ‌దు. త్రివిక్ర‌మ్ రావు సినిమాలు నిర్మిస్తున్న క్ర‌మంలో ఆయ‌న‌కు ఎన్టీఆర్ స‌హాయ‌స‌హ‌కారాలు అందించేవారు. ఎన్టీఆర్ సినిమాల్లోకి వెళ్లిన స‌మ‌యంలో త్రివిక్ర‌మ్ రావు కుటుంబాన్ని చూసుకున్నారు. అంతే కాకుండా కుటుంబాన్ని తాను చూసుకుంటాన‌ని ఎన్టీఆర్ ను చెన్నైకి పంపించింది కూడా త్రివిక్ర‌మ్ రావుగారే.

Advertisement

Also Read:  కూతురికి మ‌ద్యం తాగించిన సురేఖ‌వాణి….త‌ల్లివై ఉండి ఇలా చేస్తావా అంటూ నెటిజ‌న్ల ఫైర్…!

త్రివిక్ర‌మ్ రావు ల‌క్ష్మి అనే యువ‌తిని వివాహం చేసుకున్నారు. సొంత బ్యాన‌ర్ మాత్ర‌మే కాకుండా బ‌య‌ట బ్యాన‌ర్ నుండి మంచి సినిమాలు వ‌చ్చినా ఎన్టీఆర్ ను చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చారు. ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ రావు శ‌రీరాలు వేరైనా ప్రాణాలు మాత్రం ఒక్క‌టేన‌ట‌. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించిన త‌ర‌వాత కూడా త్రివిక్ర‌మ్ రావు పార్టీ వ్య‌వ‌హార‌ల‌ను చూసుకునేవారు. ఎన్టీఆర్ రెండో సారి సీం అయిన త‌ర‌వాత ఇద్ద‌రి మ‌ధ్య ఓ ఇష్యూ వ‌చ్చింద‌ట‌.

దాంతో త్రివిక్ర‌మ్ రావు ఎన్టీఆర్ కు కొంత కాలం దూరం అయ్యారు. పార్టీకి తెలియ‌కుండా పార్టీ పేరుతో 20వేల రూపాయ‌ల వ‌ర‌కూ ఫండ్ ను క‌లెక్ట్ చేశార‌ట‌. ఆ విష‌యం ఎన్టీఆర్ కు బ‌య‌టి వ్య‌క్తుల ద్వారా తెలిసింద‌ట‌. ఆ ఫండ్ ను కార్య‌క‌ర్త‌ల సంక్షేమ నిధి కోసం క‌లెక్ట్ చేశార‌ట‌. అయినప్ప‌టికీ త‌మ్ముడైన నువ్వు నాకు చెప్ప‌కుండా అలా ఎందుకు ఫండ్ క‌లెక్ట్ చేశావంటూ ఎన్టీఆర్ సీరియ‌స్ అయ్యార‌ట‌. ఆ త‌వ‌రాత ఇద్ద‌రూ చాలా కాలం పాటూ మాట్లాడుకోలేదు. కానీ ఆ త‌ర‌వాత మ‌ళ్లీ క‌లిసిపోయారు.

Also Read:  Tollywood: ఎన్టీఆర్ నుండి పవన్ వరకు రెండు పెళ్లిల్లు చేసుకున్న తెలుగు నటులు ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading