Home » సీనియర్ ఎన్టీఆర్ కొరకు చేపలు,రొయ్యలు పీతలు, నాటుకోడి వండుకొచ్చిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

సీనియర్ ఎన్టీఆర్ కొరకు చేపలు,రొయ్యలు పీతలు, నాటుకోడి వండుకొచ్చిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

నట సార్వభౌమ అన్న ఎన్టీఆర్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా ఇండస్ట్రీలో ఆయన నటనకు ప్రత్యేకమైన గుర్తింపు లభించడమే కాకుండా, సినీ ఇండస్ట్రీ ని తారస్థాయికి తీసుకెళ్లారు. ఎన్టీఆర్ తెలుగు లోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళం ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటికే అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో ఒక రాముడు, కృష్ణుడిగా నిలిచిపోయారు. అయితే ఎన్టీఆర్ సినిమాలు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేదట. ఆయన సినిమా షూటింగ్ పూర్తయ్యే సమయానికి యూనిట్ అంతా కలిసి పండగ చేసుకునే వారట..

Advertisement

చివరి రోజు షూటింగ్ పూర్తి కాగానే అన్న గారితో కలిసి హీరో హీరోయిన్ లను ప్రత్యేకంగా పిలిపించుకుని పండుగ చేసుకునే వారట. ఆ సమయంలో ఏ సినిమా అయినా షూటింగ్ పూర్తయ్యే సమయానికి అందరినీ పిలిచి విందు ఇవ్వడం జెమిని, వాహిని స్టూడియో నిర్మాతలకు ఒక ఆనవాయితి. తమిళనాట సినిమారంగంలో ఈ ఆనవాయితీ ఇప్పుడు కూడా నడుస్తోంది. ఇక అన్నగారి సినిమాల్లో మాత్రం సావిత్రి హీరోయిన్ గా ఎక్కువ నటించేవారు. ఆమె భోజన ప్రియురాలు. మరీ ముఖ్యంగా మాంసాహారం అంటే ఎక్కువగా ఇష్టపడేదట. ఎన్టీఆర్ కి కూడా మాంసాహారం అంటే చాలా ఇష్టం..

Advertisement

అలా చివరి రోజు షూటింగ్ అయిన తర్వాత విందు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఎన్టీఆర్ కోసం వంటకాలు చేయించి తెచ్చే వారట. ఎన్టీఆర్ తో పాటుగా నటీనటులకు కూడా పీతలు, రొయ్యలు, చేపల పులుసు తో పాటు నాటు కోడి ఇంకా రెండు మూడు రకాల ఆహార పదార్ధాలు చేయించి తెచ్చే వారని తెలుస్తోంది. ఈ సంప్రదాయాన్ని శారదా కొన్నాళ్లు పాటించారు… దీని తర్వాత వాణిశ్రీ కొనసాగించారు. వాణిశ్రీ కూడా ఎన్టీఆర్ కొరకు రకరకాల వంటకాలు వండి తెచ్చి సెట్లో ఆయనకు పెట్టేవారట.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నిర్మలమ్మ కూడా ఈ ఆనవాయితీని కొనసాగించిన విషయం అందరికీ తెలిసిందే.

ALSO READ:

Visitors Are Also Reading