ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ చిన్నవయసులోనే ఈ లోకాన్ని విడిచివెళ్లిన సంగతి తెలిసిందే. చిత్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ అతితక్కువ కాలంలో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. కానీ ఎంత త్వరగా ఎదిగాడో అంతే త్వరగా ఉదయ్ కిరణ్ కెరీర్ పతనం కూడా అయ్యింది.
Also Read: ఇక నుంచి నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే జైలుకే..!
సినిమాలు ఫ్లాప్ అవ్వడం వచ్చిన అవకాశాలు వెనక్కిపోవడం ఫ్యామిలీ టెన్షన్స్ ఇలా ఒక్కొక్కటిగా చుట్టుముట్టడంతో ఉదయ్ కిరణ్ చివరికి ఆత్మహత్య చేసుకుని తనువుచాలించాడు.
అయితే ఇప్పటికీ ఉదయ్ కిరణ్ ను ప్రేక్షకులు మర్చిపోలేకపోతున్నారు. కాగా తాజాగా ప్రముఖ నటుడునిర్మాత మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూకు వెళ్లగా ఉదయ్ కిరణ్ ప్రస్థావన వచ్చింది. కాగా మురళీ మోహన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అతడు సినిమాకు హీరోగా ముందు ఉదయ్ కిరణ్ నే అనుకున్నామని చెప్పారు. కానీ ఉదయ్ కిరణ్ డేట్స్ బిజీగా ఉన్నాయని చెప్పడంతో మహేశ్ బాబు తో తెరకెక్కించామని చెప్పారు.
అదే విధంగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి ప్రశ్నించగా..అతడు అప్పుడప్పుడూ తన వద్దకు వచ్చేవాడని చెప్పారు. అంతే కాకుండా ఉదయ్ కిరణ్ కు హైపర్ టెన్షన్ ఉండేదని బీపీలా వచ్చేదని చెప్పారు. దాని కోసం డాక్టర్ వద్ద కూడా చూపించామని చెప్పారు. ఎక్కువగా ఆవేశపడేవాడని దాని వల్ల అలా వచ్చేదని దానికి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడని చెప్పారు.
అంతే కాకుండా చిరంజీవి వద్దకు కూడా వెళ్లి కలవడం వల్ల ఆయనకు నచ్చి ఉదయ్ కిరణ్ ను ఫ్యామిలీలో కలుపుకుందామని అనుకున్నారని చెప్పారు. కానీ ఆ తరవాత అది క్యాన్సిల్ అయ్యిందని చెప్పారు. ఇక ఉదయ్ కిరణ్ కెరీర్ లోనూ వరుస ఫ్లాప్ ల వల్ల డిప్రెషన్ లోకి వెళ్లాడని అన్నారు. ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్ ను కోల్పోయినట్టుగా బాధపడ్డామని అన్నారు.
ALSO READ : 24 ఇడ్లీలు, 30బజ్జీలు…ఎన్టీఆర్ ఫుడ్ మెనూ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!