టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఉదయ్ కిరణ్ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఎంత త్వరగా కెరీర్ లో పైకి వచ్చాడో అంతే త్వరగా ఉదయ్ కిరణ్ కెరీర్ డౌన్ ఫాల్ అయ్యింది. అలా జరగడానికి పలు కారణాలు ఉన్నాయని చెప్పుకుంటారు. ఇక చివరికి డిప్రెషన్ లోకి వెళ్లిన ఉదయ్ కిరణ్ అందులో నుండి బయటకు రాలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
Advertisement
ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో రీమాసేన్ హీరోయిన్ గా నటించగా ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను రామోజీరావు నిర్మించారు. ఈ సినిమా తరవాత మళ్లీ తేజ దర్శకత్వంలోనే ఉదయ్ కిరణ్ హీరోగా నువ్వు నేను సినిమా వచ్చింది. ఈ చిత్రంలో అనిత హీరోయిన్ గా నటించిది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ రెండు సినిమాల తరవాత ఉదయ్ కిరణ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
Advertisement
టాప్ నిర్మాతలు ఉదయ్ కిరణ్ తో సినిమాలు చేసేందుకు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ లో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ రెండు సినిమాలు ఒకటి మనసంతా నువ్వే కాగా మరో సినిమా నీ స్నేహం ఈ రెండు చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి.
నువ్వు నేను విడుదల సమయంలో అభిమానులతో థియేటర్లు నిండిపోయాయి.ఈ సినిమా థియేటర్ లో నడుస్తున్న సమయంలో కోడి రామృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన త్రినేత్రం సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని దేవి థియేటర్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడే ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హోలీ సినిమా రిలీజ్ అవ్వడంతో దేవీ థియేటర్ లో కోడిరామకృష్ణ సినిమా విడుదల కాలేదు.
Also read :
సౌందర్యకు తీరని కోరిక ఉండేదట.. అది ఏంటో తెలిస్తే మీరు కన్నీరు పెడతారు..?