టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ పై చీటింగ్ కేసు నమోదైంది. సినిమా నిర్మాణం కోసం బెల్లంకొండ సురేశ్ తన వద్ద రూ.85 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదంటూ బంజారాహిల్స్ కు చెందిన శరణ్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. దాంతో బెల్లంకొండ సురేశ్ పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement
ఓ సినిమా నిర్మాణం కోసం బెల్లంకొండ సురేశ్ తన వద్ద 2018 లో రూ.50 లక్షలు తీసుకున్నాడని ….ఆ తరవాత గోపించంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా అంటూ రూ.85 లక్షలు తీసుకున్నాడని శరణ్ ఆరోపించారు. అలా తన వద్ద రెండు సార్లు మొత్తం రూ.85 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదంటూ శరణ్ కోర్టుకు వెళ్లారు.
దీనిపై విచారణ జరపాలని కోర్టు పోలీసులను ఆదేశించడంతో బెల్లంకొండ సురేశ్ పై పోలీసు కేసు నమోదైంది. ఇదిలా ఉండగా బెల్లంకొండ సురేశ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయన భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు. మరోవైపు బెల్లంకొండ సురేశ్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సినిమాలు చేస్తున్నారు.